Operation Muskan: కొనసాగుతున్న ఆపరేషన్ ముస్కాన్.. ఎప్పటి వరకు అంటే..
- బాల్యాన్ని వెట్టి నుంచి విడిపించేందుకు ‘ఆపరేషన్ ముస్కాన్’..
- ఈ నెల 31 వరకు జరిగే కార్యక్రమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Muskan: ‘ఆపరేషన్ ముస్కాన్’ అనేది పిల్లలను బానిసత్వం నుండి విముక్తి చేసే కార్యక్రమం. ఈ నెల 31 వరకు జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు సన్నద్ధమయ్యారు. ఇందుకోసం ఐదు బృందాలను నియమించారు. ప్రతి ఏటా జూలై 1 నుంచి 31వ తేదీ వరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించడం జరుగుతుందన్నారు. లక్షిత దాడులకు ప్రణాళిక సిద్ధం చేశారు. పిల్లలతో పనిచేసే అవకాశాలు ఉన్న స్థావరాలు గుర్తించారు. జిల్లాలోని పలు పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, గోదాములు, గోదాములు, మెకానిక్ షాపులు తదితర ప్రాంతాల్లో వ్యూహాత్మక తనిఖీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గతేడాది 33 మందికి వెట్టి నుంచి విముక్తి కల్పించారు. వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వారిలో 14 మంది బాలికలు కాగా, మిగిలిన వారు బాలురు. మైనర్లతో పని చేస్తున్న ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు. బాధితుల్లో ఎవరైనా అనాథలైతే, వారిని చైల్డ్ కేర్ హోమ్లో ఉంచుతారు. అవసరమైన ప్రక్రియను పోలీసు శాఖ పూర్తి చేస్తుంది.
Read also: Vijay Mallya: రూ.180 కోట్ల రుణం ఎగవేత కేసు.. విజయ్ మాల్యాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్-10 కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పరిశ్రమలు, వ్యాపార సముదాయాల్లో ఈ ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహిస్తాయని, పిల్లలను పనిలో పెట్టుకునే యజమానులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ ప్రత్యేక బృందాలు పట్టుబడిన పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగిస్తామని, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ అందించి, అనాథలుగా ఉంటే వారిని కేర్హోమ్కు తరలించనున్నట్లు ఆమె తెలిపారు. బాధితుల్లో ఎవరైనా అనాథలైతే, వారిని చైల్డ్ కేర్ హోమ్లో ఉంచుతారు. అవసరమైన ప్రక్రియను పోలీసు శాఖ పూర్తి చేస్తుంది. జిల్లాలో ఎక్కడైనా బాలకార్మికులు కనిపిస్తే వెంటనే 100 లేదా 1098కు డయల్ చేయాలని, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 8712659360కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.
Weather Latest Update: 3 రోజులకు వాతావరణ సూచన.. హైదరాబాద్ లో..
తాజావార్తలు
-
Patriotic Telugu Movies : ప్రభాస్ నుంచి ఎన్టీఆర్ వరకు… ‘దేశభక్తి’ టాలీవుడ్ హీరోల కొత్త ఆయుధం
-
Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
-
2026 Audi Q7: సూపర్ ఫాస్ట్ SUV.. 4.8 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకునే 2026 Audi Q7
ట్రెండింగ్
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!