Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Online Betting Took A Life Of Boy In Hyderabad

Online Betting Crime: విషాదం.. యువకుడ్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్

Published Date :February 20, 2023 , 8:03 am
By NTV WebDesk
Online Betting Crime: విషాదం.. యువకుడ్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Online Betting Took A Life Of Boy In Hyderabad: ఆన్‌లైన్ బెట్టింగ్స్ ఎందరో జీవితాల్ని నాశనం చేశాయి. కొందరి ప్రాణాల్ని సైతం బలి తీసుకుంది. ఇప్పుడు ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. చేతికి అందివచ్చిన కొడుకుని పొట్టనబెట్టుకుంది. తల్లి దాచిన బంగారాన్ని బెట్టింగ్‌లో ఓడిపోవడం, తల్లి నిలదీయడంతో.. తీవ్ర మనస్థాపానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్​ పోలీస్‌​స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Tamilisai Soundararajan: నడుస్తూ నడుస్తూ ..కిందపడ్డ గవర్నర్ తమిళిసై

Also Read

  • KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
  • Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
  • Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
  • Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు

మామిడిపల్లికి చెందిన చంద్రయ్య, శశికళ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు రాజశేఖర్​ (26) ఇంటర్మీడియట్​ వరకు చదివాడు. కొంతకాలం నుంచి శంషాబాద్​ ఎయిర్​‌పోర్టులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న రాజశేఖర్‌.. గత సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌లో ప్లేయింగ్ కార్డ్స్, క్రికెట్ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. ఏదో ఒకరోజు జాక్‌పాట్ తగులుతుందన్న ఆశతో.. అతడు బెట్టింగ్స్ వేయడం షురూ చేశాడు. అయితే.. ఆ బెట్టింగ్స్ వల్ల ఇతనికి డబ్బులు రాకపోగా, అప్పుడు ఎక్కువ అయ్యాయి. మూడు నుంచి నాలుగు లక్షల వరకు డబ్బులు పోగొట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా.. బీరువాలో తల్లి శశికళ దాచిపెట్టిన బంగారాన్ని సైతం కుదవపెట్టి, బెట్టింగ్‌లో ఓడిపోయాడు.

Cantonment By Election: కంటోన్మెంట్ కి ఉప ఎన్నిక లేనట్టే.. ఎందుకంటే?

కట్ చేస్తే.. శివరాత్రి సందర్భంగా ఈనెల 18వ తేదీన సాయంత్రం 4గంటలకు శశికల బీరువాను క్లీన్ చేస్తుండగా, అందులో తాను దాచిపెట్టిన తులంనర బంగారం కనిపించలేదు. దీంతో తన భర్తతో పాటు ముగ్గురు పిల్లలను అడిగింది. రాజశేఖర్‌నూ ‘నువ్వు తీశావా?’ అంటూ గట్టిగా నిలదీసింది. అతడు భయంతో తాను తీయలేదని సమాధానం ఇచ్చాడు. అదే రోజు రాత్రి డ్యూటికని వెళ్లిన రాజశేఖర్.. ఆ బంగారం తానే తీసుకున్నానని, ఆన్‌లైన్ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నానని, శంషాబాద్‌లో ఓ వ్యక్తి వద్ద రూ.40 వేలకు కుదవపెట్టానని, దానికి సంబంధించిన స్లిప్‌లు తన మొబైల్​ పోచ్​ వెనుక ఉన్నాయని మెసేజ్ చేశాడు. తాను చేసిన తప్పుకి ఆత్మహత్య చేసుకుంటున్నానని కూడా అందులో పేర్కొన్నాడు.

Celebrities Heart Strokes: పునీత్ నుంచి తారకరత్న దాకా.. 18నెలల్లో ఏడుగురు మృత్యువాత

తల్లిని, తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తూ.. తన సోదరుడికి ఆదివారం తెల్లవారుజామున 2.44 గంటలకు మెసేజ్​ చేశాడు. అయితే.. ఆ సమయంలో అందరూ నిద్రపోయి ఉండటంతో, ఆ మెసేజ్‌ని ఎవ్వరూ చూసుకోలేదు. అయితే.. ఎప్పట్లాగే తండ్రి చంద్రయ్య ఉదయం 5గంటలకు పాలు పితికేందుకు షెడ్ వద్దకు వెళ్లాడు. అక్కడ వేపచెట్టుకు రాజశేఖర్​ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొని ఉండడం చూసి.. ఒక్కసారిగా షాకయ్యాడు. అతని మరణవార్త విని.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Crime News
  • HYDERABAD News
  • Online Bettings
  • Online Playing Cards
  • Shamshabad Airport

తాజావార్తలు

  • Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!

  • Donald Trump: ట్రంప్‌ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి

  • KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..

  • Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

  • Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions