TGPSC Group 1 Prelims: గ్రూప్ ప్రిలిమినరీ పరీక్షకు లక్ష మంది డుమ్మా.. కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGPSC Group 1 Prelims: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిన్న (జూన్ 9) ప్రశాంతంగా జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా పరీక్ష నిర్వహించారు. ఇక ఓఎంఆర్ పద్ధతిలో 895 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. అయితే.. లక్ష మందికి పైగా అభ్యర్థులు గ్రూప్ ప్రిలిమినరీ పరీక్షకు గైర్హాజరు అయ్యారని అధికారులు వెల్లడించారు. కాగా.. అభ్యర్థులు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.02 లక్షల మంది మాత్రమే హాజరయ్యారని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు. అంటే 74 శాతం మంది మాత్రమే పరీక్ష రాశారు. గ్రూప్ 1 కింద 536 పోస్టులు ఉండగా ఒక్కో పోస్టుకు 536 మంది పోటీ పడనున్నట్లు తెలిపారు. దీంతో.. పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్ ఆన్సర్ కీని త్వరలో విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది.
Read also: CM Revanth Reddy: నేడు రవీంద్ర భారతికి సీఎం రేవంత్ రెడ్డి
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
కాగా.. అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా మల్టీ జోన్, రోస్టర్ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 28,150 మందిని మెయిన్ పరీక్షకు ఎంపిక చేయనున్నట్లు కమిషన్ వెల్లడించింది. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి 25 ప్రశ్నలు వచ్చాయి. గణిత నేపథ్యం ఉన్నవారు వీటికి సమాధానాలను సులభంగా గుర్తించవచ్చు. సర్వేలు, నివేదికల నుంచి కూడా ప్రశ్నలు వచ్చాయి. ఈసారి సాధారణ కటాఫ్ 75-80 మార్కుల మధ్య ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆదివారం గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగడంతో చాలా మంది అభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు.
Read also: Uttarpradesh : ఇంట్లో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన 11 మంది
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన పరీక్షకు నలుగురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించలేదు. అలాగే కాల్వశ్రీరాంపూర్కు చెందిన సాయిప్రియ పరీక్షకు హాజరయ్యేందుకు వెళ్తుండగా కూనారం రైలు గేటు పడిపోవడంతో ఐదు నిమిషాలు ఆలస్యమైంది. అధికారులు అనుమతించకపోవడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. చేసేదేమీ లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. మరోవైపు మంథన్కు చెందిన ప్రసన్య పొరపాటున మరో స్నేహితురాలి హాల్టికెట్ తీసుకురాగా, అధికారులు ఆమెను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు.
Amaravati: అమరావతికి పూర్వ వైభవం..సంతోషంలో రైతులు
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!