Site icon NTV Telugu

దేవాదాయశాఖ కార్యాలయాన్ని ముట్టడించిన ఒగ్గు పూజరులు

హైదరాబాద్ అబిడ్స్ బొగ్గులకుంట లోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించిన తెలంగాణ రాష్ట్ర ఒగ్గు బీర్ల కళాకారులు.మల్లన్న ఒగ్గు కథ చెబుతూ .. ఒగ్గు సంప్రదాయ పూజలు చేసి నిరసన తెలిపిన ఒగ్గు పూజారులు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఒగ్గు పూజారులను గర్భగుడి పూజల నుంచి బహిష్కరించడం దారుణమన్నారు. ఎన్నో ఏళ్లుగా పూజారులుగా కొనసాగుతున్న తమను తొలిగించి..వీర శైవ (బలిజ) పూజారులను కొనసాగించడంపై ఒగ్గుపూజారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: దేశీయంగా చమురు ఉత్పత్తిని పెంచాలి: వెంకయ్యనాయుడు

స్వామివారి మేలుకొలుపు, పవలింపు సేవా ఒగ్గు పూజారులచేత మూల విరాట్‌ మల్లన్న స్వామి దగ్గర నిలబడి చేయించడం ఆనవాయితీ అని వారు చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం తమను కాదని వేరే వారిని తీసుకోవడం బాధాకరమన్నారు. ఆ సేవలు, పూజల నుండి మమ్మల్ని దేవస్థానం అధికారులు దూరం చేయడం అన్యాయమని వారు పేర్కొంటున్నారు. తరతరాలుగా స్వామి వారికి చేస్తున్న సేవలను యథావిధిగా ఒగ్గుపూజారులచే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయం పై వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్,దేవాదాయ శాఖ అధికారులు జోక్యం చేసుకొని మాకు న్యాయం చేయాలని వారు కోరారు.

Exit mobile version