Nvss Prabhakar: కేంద్ర ఆర్థిక మంత్రితో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ని న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఈరోజు కలిశారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేటటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల అనేక మంది నిరుపేదలు, నిరుద్యోగులు, మహిళలు, దారిద్ర రేఖకు దిగువ ఉన్న ఉన్న ప్రజలు లబ్ధిని పొందలేక పోతున్నారని వివరించారు.
కరోనా కష్టకాలంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం వల్ల వందలాది కుటుంబాలు వేలాదిమంది కరోనా బాధితులు తీవ్రమైన ఇబ్బందికి గురి అయ్యారని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి వివరించారు. ఆత్మనిర్భర భారత్ కింద కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు, కులవృత్తులకు, చేతివృత్తులకు, చిన్నతరహ సూక్ష్మ పరిశ్రమలు పొందవలసిన ప్రయోజనాలను కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు పొందలేకపోయారు. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి ,విద్య, వైద్యం వివిధ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించవలసిన వాటా కేటాయింపులో తీవ్రమైన జాప్యం వల్ల అభివృద్ధికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి.
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఈ పాలనలో అప్పుల రాష్ట్రంగా మారిందని మంత్రిదృష్టికి ప్రభాకర్ తీసుకువచ్చారు. పదేపదే ఎఫ్ ఆర్ బి ఎం ను పెంచమని కోరుతూ ఆర్థికపరమైన క్రమశిక్షణ తప్పింది తెలంగాణ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని మరిచి కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకుండా నీరుగార్చడానికి ప్రయత్నిస్తోందన్నారు.
15వ ఫైనాన్స్ కమిషన్ అనేక మార్గదర్శక సూత్రాలను ఏర్పర్చినప్పటికీ స్థానిక ప్రభుత్వాలను అంటే పురపాలక సంఘాలు మండలాలను కార్పొరేషన్లను నిధులు బదలాయించకుండా ప్రభుత్వమే పెత్తనం చెలాయిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో వాటి అమలు తీరును సమీక్షించే వలసిందిగా మంత్రిని కోరారు. పథకాలు అమలు చేయని రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో ఒక కొత్త చట్టం చేయవలసిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి ప్రభాకర్ తీసుకువచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని రైల్వేలో అభివృద్ధికి గ్రామీణ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి ఇతర కార్యక్రమాలకు పెద్దఎత్తున నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.
తాజావార్తలు
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!