Nvss Prabhakar: కేంద్ర ఆర్థిక మంత్రితో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ని న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఈరోజు కలిశారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేటటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల అనేక మంది నిరుపేదలు, నిరుద్యోగులు, మహిళలు, దారిద్ర రేఖకు దిగువ ఉన్న ఉన్న ప్రజలు లబ్ధిని పొందలేక పోతున్నారని వివరించారు.
కరోనా కష్టకాలంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం వల్ల వందలాది కుటుంబాలు వేలాదిమంది కరోనా బాధితులు తీవ్రమైన ఇబ్బందికి గురి అయ్యారని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి వివరించారు. ఆత్మనిర్భర భారత్ కింద కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు, కులవృత్తులకు, చేతివృత్తులకు, చిన్నతరహ సూక్ష్మ పరిశ్రమలు పొందవలసిన ప్రయోజనాలను కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు పొందలేకపోయారు. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి ,విద్య, వైద్యం వివిధ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించవలసిన వాటా కేటాయింపులో తీవ్రమైన జాప్యం వల్ల అభివృద్ధికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి.
Also Read
- Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
- Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
- DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
- Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు!
ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఈ పాలనలో అప్పుల రాష్ట్రంగా మారిందని మంత్రిదృష్టికి ప్రభాకర్ తీసుకువచ్చారు. పదేపదే ఎఫ్ ఆర్ బి ఎం ను పెంచమని కోరుతూ ఆర్థికపరమైన క్రమశిక్షణ తప్పింది తెలంగాణ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని మరిచి కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకుండా నీరుగార్చడానికి ప్రయత్నిస్తోందన్నారు.
15వ ఫైనాన్స్ కమిషన్ అనేక మార్గదర్శక సూత్రాలను ఏర్పర్చినప్పటికీ స్థానిక ప్రభుత్వాలను అంటే పురపాలక సంఘాలు మండలాలను కార్పొరేషన్లను నిధులు బదలాయించకుండా ప్రభుత్వమే పెత్తనం చెలాయిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో వాటి అమలు తీరును సమీక్షించే వలసిందిగా మంత్రిని కోరారు. పథకాలు అమలు చేయని రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో ఒక కొత్త చట్టం చేయవలసిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి ప్రభాకర్ తీసుకువచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని రైల్వేలో అభివృద్ధికి గ్రామీణ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి ఇతర కార్యక్రమాలకు పెద్దఎత్తున నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.
తాజావార్తలు
-
CM Chandrababu: రాజధాని నిర్మాణాల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానిస్తం.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
-
Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
-
Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!