Nvss Prabhakar: కేంద్ర ఆర్థిక మంత్రితో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ప్రభుత్వ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ని న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ శాసనసభ్యుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఈరోజు కలిశారు. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేటటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల అనేక మంది నిరుపేదలు, నిరుద్యోగులు, మహిళలు, దారిద్ర రేఖకు దిగువ ఉన్న ఉన్న ప్రజలు లబ్ధిని పొందలేక పోతున్నారని వివరించారు.
కరోనా కష్టకాలంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయకపోవడం వల్ల వందలాది కుటుంబాలు వేలాదిమంది కరోనా బాధితులు తీవ్రమైన ఇబ్బందికి గురి అయ్యారని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కి వివరించారు. ఆత్మనిర్భర భారత్ కింద కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులకు, కులవృత్తులకు, చేతివృత్తులకు, చిన్నతరహ సూక్ష్మ పరిశ్రమలు పొందవలసిన ప్రయోజనాలను కేసీఆర్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు పొందలేకపోయారు. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి ,విద్య, వైద్యం వివిధ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం అందించవలసిన వాటా కేటాయింపులో తీవ్రమైన జాప్యం వల్ల అభివృద్ధికి అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి.
Also Read
- Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
- Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఈ పాలనలో అప్పుల రాష్ట్రంగా మారిందని మంత్రిదృష్టికి ప్రభాకర్ తీసుకువచ్చారు. పదేపదే ఎఫ్ ఆర్ బి ఎం ను పెంచమని కోరుతూ ఆర్థికపరమైన క్రమశిక్షణ తప్పింది తెలంగాణ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని మరిచి కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయకుండా నీరుగార్చడానికి ప్రయత్నిస్తోందన్నారు.
15వ ఫైనాన్స్ కమిషన్ అనేక మార్గదర్శక సూత్రాలను ఏర్పర్చినప్పటికీ స్థానిక ప్రభుత్వాలను అంటే పురపాలక సంఘాలు మండలాలను కార్పొరేషన్లను నిధులు బదలాయించకుండా ప్రభుత్వమే పెత్తనం చెలాయిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో వాటి అమలు తీరును సమీక్షించే వలసిందిగా మంత్రిని కోరారు. పథకాలు అమలు చేయని రాష్ట్రాలకు సంబంధించిన విషయంలో ఒక కొత్త చట్టం చేయవలసిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి ప్రభాకర్ తీసుకువచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని రైల్వేలో అభివృద్ధికి గ్రామీణ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి ఇతర కార్యక్రమాలకు పెద్దఎత్తున నిధులు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.
తాజావార్తలు
-
Saroj Khan: మాధురీని ఉదాహరణగా చూపిస్తూ.. కరిష్మాపై ఫైర్ అయిన సరోజ్ ఖాన్..
-
Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Virat Kohli: ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు.. సీఎస్కే, ఎంఐ కాదు టాప్లో కేకేఆర్!
-
Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?