F2F With Raghunandan Rao: నాకు బండి సంజయ్తో ఎలాంటి విభేదాలు లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుతో ఎన్టీవీ ప్రత్యేకంగా ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్రావు మాట్లాడుతూ.. తాను తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేశానని.. ఇప్పుడు దేశం పనిచేయడానికి తనకు బీజేపీ అవకాశం ఇచ్చిందని తెలిపారు. తాను నూటికి నూరు శాతం బీజేపీలో కంఫర్ట్గానే ఉన్నానని స్పష్టం చేశారు. మళ్లీ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తానన్న వార్తలను రఘునందన్రావు ఖండించారు. మునిగిపోయే పడవ ఎక్కాలని ఎవరైనా అనుకుంటారా అని ప్రశ్నించారు. తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో విరక్తి పెరుగుతోందని ఆరోపించారు. ఇంటికి రూ.10 లక్షలు ఇస్తామని ఎస్ఎమ్మెస్ చేసినా ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు.
బీజేపీలో టాలెంట్ ఉండి పనిచేసేవాళ్లకు తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని రఘునందన్రావు అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీల నుంచి వచ్చి పనిచేసిన వాళ్లను కేంద్రమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేసిన చరిత్ర బీజేపీలో ఉందని గుర్తుచేశారు. ఉదాహరణకు తీసుకుంటే అసోంలో హేమంత బిశ్వంత శర్మ గత పదేళ్లుగా పార్టీలో కష్టపడి పనిచేశారని.. ఇప్పుడు ఆయనకు సీఎంగా అవకాశం వచ్చిందన్నారు. బీజేపీలో తొలి నుంచి పార్టీలో ఉన్నవాళ్లకే ప్రాధాన్యం ఉంటుందనే వాదన తప్పు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పొలిటికల్ డైనమిక్స్ మారుతుంటాయని.. పార్టీ నిర్ణయాలు కూడా మారుతుంటాయని రఘునందన్రావు తెలిపారు. ఈరోజే పార్టీలోకి వచ్చి రేపే ముఖ్యమంత్రి కావాలన్న ఆశ ఏ పార్టీలోనూ నెరవేరదని రఘునందన్రావు అన్నారు. రాజకీయాల్లో ఓపిక ఉంటే పదవులు వాటంతట అవే వస్తాయని అభిప్రాయపడ్డారు.
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
లక్ష్మణ్ తర్వాత తాను బీజేపీ అధ్యక్ష పదవి అడిగిన మాట వాస్తవమే అయినా ఇప్పుడు బండి సంజయ్ నేతృత్వంలో పనిచేస్తున్నానని రఘునందన్రావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో పార్టీకి ఇప్పుడు ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలం బండి సంజయ్ నేతృత్వంలో కలిసి పనిచేస్తున్నామని.. అందరం సమష్టిగా కలిసి నిర్ణయం తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. బండి సంజయ్తో తనకు ఎలాంటి గొడవ లేదని.. అదంతా మీడియా ప్రచారమే అని కొట్టిపారేశారు. ప్రోటోకాల్ గురించి తానెక్కడా బహిరంగంగా మాట్లాడలేదన్నారు. మీటింగుల గురించి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందే తప్ప అది అసంతృప్తి కాదన్నారు. 2018లో కేసీఆర్ ఇచ్చిన హామీలకు ఇప్పటి వరకు దిక్కూ మొక్కు లేదని ఆరోపించారు. కేంద్రం పైసలు ఇస్తేనే నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పాడా అని ప్రశ్నించారు. ఉద్యమంలో కలిసి పనిచేసిన వారికి టీఆర్ఎస్లో ప్రాధాన్యం లభించలేదని.. ఉద్యమంలో పాలుపంచుకోని తలసాని, తుమ్మల, కడియం వంటి వాళ్లకు టీఆర్ఎస్లో ప్రాధాన్యం ఇచ్చి తమ లాంటి వాళ్లను పట్టించుకోలేదని రఘునందన్రావు విమర్శలు చేశారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..