F2F With Raghunandan Rao: నాకు బండి సంజయ్తో ఎలాంటి విభేదాలు లేవు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావుతో ఎన్టీవీ ప్రత్యేకంగా ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్రావు మాట్లాడుతూ.. తాను తెలంగాణ ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేశానని.. ఇప్పుడు దేశం పనిచేయడానికి తనకు బీజేపీ అవకాశం ఇచ్చిందని తెలిపారు. తాను నూటికి నూరు శాతం బీజేపీలో కంఫర్ట్గానే ఉన్నానని స్పష్టం చేశారు. మళ్లీ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తానన్న వార్తలను రఘునందన్రావు ఖండించారు. మునిగిపోయే పడవ ఎక్కాలని ఎవరైనా అనుకుంటారా అని ప్రశ్నించారు. తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో విరక్తి పెరుగుతోందని ఆరోపించారు. ఇంటికి రూ.10 లక్షలు ఇస్తామని ఎస్ఎమ్మెస్ చేసినా ప్రజలు ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదన్నారు.
బీజేపీలో టాలెంట్ ఉండి పనిచేసేవాళ్లకు తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందని రఘునందన్రావు అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీల నుంచి వచ్చి పనిచేసిన వాళ్లను కేంద్రమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా చేసిన చరిత్ర బీజేపీలో ఉందని గుర్తుచేశారు. ఉదాహరణకు తీసుకుంటే అసోంలో హేమంత బిశ్వంత శర్మ గత పదేళ్లుగా పార్టీలో కష్టపడి పనిచేశారని.. ఇప్పుడు ఆయనకు సీఎంగా అవకాశం వచ్చిందన్నారు. బీజేపీలో తొలి నుంచి పార్టీలో ఉన్నవాళ్లకే ప్రాధాన్యం ఉంటుందనే వాదన తప్పు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పొలిటికల్ డైనమిక్స్ మారుతుంటాయని.. పార్టీ నిర్ణయాలు కూడా మారుతుంటాయని రఘునందన్రావు తెలిపారు. ఈరోజే పార్టీలోకి వచ్చి రేపే ముఖ్యమంత్రి కావాలన్న ఆశ ఏ పార్టీలోనూ నెరవేరదని రఘునందన్రావు అన్నారు. రాజకీయాల్లో ఓపిక ఉంటే పదవులు వాటంతట అవే వస్తాయని అభిప్రాయపడ్డారు.
Also Read
- Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
- Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
- NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
లక్ష్మణ్ తర్వాత తాను బీజేపీ అధ్యక్ష పదవి అడిగిన మాట వాస్తవమే అయినా ఇప్పుడు బండి సంజయ్ నేతృత్వంలో పనిచేస్తున్నానని రఘునందన్రావు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో పార్టీకి ఇప్పుడు ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలం బండి సంజయ్ నేతృత్వంలో కలిసి పనిచేస్తున్నామని.. అందరం సమష్టిగా కలిసి నిర్ణయం తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. బండి సంజయ్తో తనకు ఎలాంటి గొడవ లేదని.. అదంతా మీడియా ప్రచారమే అని కొట్టిపారేశారు. ప్రోటోకాల్ గురించి తానెక్కడా బహిరంగంగా మాట్లాడలేదన్నారు. మీటింగుల గురించి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందే తప్ప అది అసంతృప్తి కాదన్నారు. 2018లో కేసీఆర్ ఇచ్చిన హామీలకు ఇప్పటి వరకు దిక్కూ మొక్కు లేదని ఆరోపించారు. కేంద్రం పైసలు ఇస్తేనే నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పాడా అని ప్రశ్నించారు. ఉద్యమంలో కలిసి పనిచేసిన వారికి టీఆర్ఎస్లో ప్రాధాన్యం లభించలేదని.. ఉద్యమంలో పాలుపంచుకోని తలసాని, తుమ్మల, కడియం వంటి వాళ్లకు టీఆర్ఎస్లో ప్రాధాన్యం ఇచ్చి తమ లాంటి వాళ్లను పట్టించుకోలేదని రఘునందన్రావు విమర్శలు చేశారు.
తాజావార్తలు
-
Yashasvi Jaiswal: ‘అలా ప్రవర్తించకూడదు’.. జైస్వాల్పై ఐసీసీ చర్యలు తప్పవు?
-
Karn Sharma Retirement: నాలుగు ఐపీఎల్ టైటిళ్ల హీరో రిటైర్మెంట్.. భారత్, ఐపీఎల్, దేశవాళీ క్రికెట్కు గుడ్బై!
-
Rahul Ramakrishna: అలాంటి పాత్రలు చేయడం ఇష్టం లేదు.. విజయ్ దేవరకొండ నా కాల్స్ తీసుకోవడం మానేశాడు..
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Ajith Kumar: అజిత్తో రాజమౌళి అసిస్టెంట్ సినిమా?.. భారీ పాన్ ఇండియా ప్లాన్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!