TSRTC: ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లకు నో హాలీడే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. గతంలో వివిధ రూట్లలో పల్లెటూరి బస్సుల్లో ప్రయాణించే వారు ప్రస్తుతం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యంతో ఎక్స్ ప్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. గత ఆదివారంతో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య 15 శాతం పెరగలేదని అధికారులు వెల్లడించారు. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలోని మహిళలు, యువతులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఈ నెల 9 నుంచి ఈ పథకం అమల్లోకి రావడంతో.. చాలా మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. అయితే.. గత ఆదివారం (డిసెంబర్ 3)తో పోలిస్తే ఈ ఆదివారం (డిసెంబర్ 10) దాదాపు 15 శాతం పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బస్సు ప్రయాణికుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని తెలిపారు. టిమ్స్లో ‘జీరో టికెట్’ సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చాక వాస్తవ సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు.
Read also: PrajaVani: నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం.. వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు
Also Read
- Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
- POCSO Court : వ్యభిచార ముఠాకు కోర్టు షాక్.. 5 మందికి లైఫ్, 33 మందికి కఠిన శిక్షలు.!
- DGP CV Anand : తెలంగాణ పోలీసుల్లో భారీ మార్పులు.. 513 మందికి కొత్త టాస్క్లు!
- Duddilla Sridhar Babu: మంథనిలో అభివృద్ధి పనుల జాతర.. రూ.164 కోట్లతో శంకుస్థాపనలు
ఇతర రోజుల కంటే సోమవారాలు బస్సులు సాధారణంగా రద్దీగా ఉంటాయి. నేడు కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్ల సెలవులను రద్దు చేశారు. సిబ్బందికి సెలవులు లేవని, విధులకు హాజరుకావాలన్నారు. వేములవాడ, కాళేశ్వరం, కీసరగుట్ట, రామప్ప వంటి శైవక్షేత్రాలకు అధిక సంఖ్యలో బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. సాధారణ రోజుల్లో బస్సులు 31-32 లక్షల కిలోమీటర్లు నడుస్తుండగా, సోమవారం నాటికి వాటి సంఖ్య 34 లక్షల కిలోమీటర్లకు పెరిగింది. ఈరోజు 10 శాతానికి పైగా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బస్సులతోనే ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు కొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తుంది.
Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!