TSRTC: ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీ.. డ్రైవర్లు, కండక్టర్లకు నో హాలీడే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంతో బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. గతంలో వివిధ రూట్లలో పల్లెటూరి బస్సుల్లో ప్రయాణించే వారు ప్రస్తుతం ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ప్రయాణ సౌకర్యంతో ఎక్స్ ప్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. గత ఆదివారంతో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య 15 శాతం పెరగలేదని అధికారులు వెల్లడించారు. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలోని మహిళలు, యువతులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఈ నెల 9 నుంచి ఈ పథకం అమల్లోకి రావడంతో.. చాలా మంది మహిళలు బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. అయితే.. గత ఆదివారం (డిసెంబర్ 3)తో పోలిస్తే ఈ ఆదివారం (డిసెంబర్ 10) దాదాపు 15 శాతం పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బస్సు ప్రయాణికుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని తెలిపారు. టిమ్స్లో ‘జీరో టికెట్’ సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చాక వాస్తవ సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు.
Read also: PrajaVani: నేటి నుంచి ప్రజావాణి కార్యక్రమం.. వినతులను స్వీకరించనున్న కలెక్టర్లు, ఎమ్మెల్యేలు
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ఇతర రోజుల కంటే సోమవారాలు బస్సులు సాధారణంగా రద్దీగా ఉంటాయి. నేడు కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో మహిళా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్ల సెలవులను రద్దు చేశారు. సిబ్బందికి సెలవులు లేవని, విధులకు హాజరుకావాలన్నారు. వేములవాడ, కాళేశ్వరం, కీసరగుట్ట, రామప్ప వంటి శైవక్షేత్రాలకు అధిక సంఖ్యలో బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. సాధారణ రోజుల్లో బస్సులు 31-32 లక్షల కిలోమీటర్లు నడుస్తుండగా, సోమవారం నాటికి వాటి సంఖ్య 34 లక్షల కిలోమీటర్లకు పెరిగింది. ఈరోజు 10 శాతానికి పైగా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బస్సులతోనే ప్రయాణికుల అవసరాలను తీర్చేందుకు కొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తుంది.
Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!