NTV Telugu Site icon

చేప ప్ర‌సాదంపై కీల‌క నిర్ణ‌యం…క‌రోనా కార‌ణంగా…

ప్ర‌తిఏడాది జూన్ నెల‌లో బ‌త్తిని సోద‌రులు చేప మందును పంపిణీ చేస్తుంటారు.  ఈ మందు కోసం తెలంగాణ‌లోనే కాకుండా ఇత రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హైద‌రాబాద్‌కు వ‌స్తుంటారు.  అయితే, క‌రోనా సెకండ్ వేవ్ దేశంలో తీవ్రంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.  క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా దేశంలో పెద్ద ఎత్తున కేసులు న‌మోద‌వుతున్నాయి.  రికార్ఢ్ స్థాయిలో మ‌రణాలు న‌మోద‌వుతున్నాయి.  ఇటు తెలంగాణ‌లో కూడా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్నారు.  దీంతో జూన్ 8 వ తేదీన పింపిణీ చేయాల్సిన చేప ప్ర‌సాదంను నిలిపి వేస్తున్న‌ట్టు బ‌త్తిన హరినాథ్ గౌడ్ పేర్కోన్నారు.  జూన్ 8 వ తేదీన చేప ప్ర‌సాదం ఇంట్లో వాళ్తు మాత్ర‌మే తీసుకుంటామని బ‌త్తిన సోద‌రులు పేర్కొన్నారు.