NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
- ఏటా రూ.12 వేలు.. నాలుగేళ్లలో రూ.48 వేలు
- 8వ తరగతి విద్యార్థులకు అద్భుత అవకాశం
- రూ.3.50 లక్షలలోపు ఆదాయం ఉంటే అర్హత
- ఆగస్టు 24తో ముగియనున్న దరఖాస్తు గడువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NMMS Scholarship : ప్రతిభ ఉండి కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్’ (NMMS) పథకాన్ని అందిస్తోంది. తెలంగాణలోని ప్రభుత్వ , ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే ఈ స్కాలర్షిప్కు అప్లై చేసుకోవడానికి ఆగస్టు 24వ తేదీయే చివరి గడువు అని అధికారులు స్పష్టం చేశారు.
ఏటా రూ. 12 వేల ఆర్థిక సాయం
Also Read
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
- CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
ఈ పథకానికి ఎంపికైన అర్హులైన విద్యార్థులకు ప్రతి నెలా రూ. 1,000 చొప్పున సంవత్సరానికి మొత్తం రూ. 12,000 అందజేస్తారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తి అయ్యే వరకు, అంటే వరుసగా నాలుగేళ్ల పాటు మొత్తం రూ. 48,000 ఆర్థిక సాయంగా లభిస్తుంది.
అర్హతలు , ఎంపిక విధానం
ఈ స్కాలర్షిప్కు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ. 3.50 లక్షలకు మించకూడదు. విద్యా అర్హతల విషయానికొస్తే, విద్యార్థి 7వ తరగతిలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి, అయితే ఎస్సీ , ఎస్టీ విద్యార్థులకు 50% మార్కులు ఉంటే సరిపోతుంది. ప్రత్యేకంగా నిర్వహించే రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఈ పరీక్షలో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ (MAT), స్కొలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (SAT) అనే రెండు విభాగాల ఆధారంగా ప్రశ్నలు అడుగుతారు.
కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ స్కూళ్లు , ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ వర్తించదు. ఈ స్కాలర్షిప్ లబ్ధి కొనసాగాలంటే విద్యార్థులు తమ తదుపరి చదువును తప్పనిసరిగా ప్రభుత్వ లేదా ఎయిడెడ్ విద్యాసంస్థల్లోనే కొనసాగించాల్సి ఉంటుంది. సమయం తక్కువగా ఉన్నందున అర్హత గల విద్యార్థులు వెంటనే అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!