MLC Kavitha: కేసీఆర్ను ఎదుర్కొనే దమ్ములేక.. నాపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారు..
- మన సంస్కృతిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తుంది..
- మళ్లొకసారి నిజామాబాద్ పవర్ ను సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిద్దాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: కేసీఆర్ను ఎదుర్కొనే ధైర్యం, దమ్ములేక నాపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పర్యటనలో భాగంగా కవిత మాట్లాడుతూ.. ఎన్ని కేసులు పెట్టిన భయ పడేది లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందన్నారు. బస్సుల సంఖ్య తగ్గించి ఫ్రీ బస్సు ఇస్తున్నారని తెలిపారు. అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చానని కవిత అన్నారు. నేను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డను… దేనికీ భయపడనని అన్నారు. మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం అన్నారు. మేము తప్పు చేయలేదు… భయపడే ప్రసక్తే లేదన్నారు.
Read also: Harish Rao: బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతుంది..
Also Read
ఎన్ని కేసులు పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారన్నారు. కేంద్రాన్ని ఎదురించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడుతోందన్నారు.
రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి చెప్పనవసరం లేదని తెలిపారు. రాబోయేది గులాబీ జెండా శకమే.. అందులో సందేహమే లేదని కవిత అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చంద్ర బాబు శిష్యుడని తెలిపారు. తెలంగాణ తల్లిని మరచిపోవాలని అంటున్నారన్నారు. తెలంగాణ తల్లి మాది, కాంగ్రెస్ తల్లి మీదన్నారు. తెలంగాణ సంస్కృతి పై దాడి జరుగుతుందన్నారు. పేరు మర్పిపోయినా, రైతులు భూములు ఇవ్వకపోయినా సీఎం రేవంత్ కేసులు పెడుతున్నారని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఎందుకింత భయం ? అని ప్రశ్నించారు. డిగ్రీ చదువుకున్న ఆడపిల్లలకు స్కూటీల పంపిణీ ఏమైంది ? మహిళలకు నెలకు రూ. 2500, కళ్యాణ లక్ష్మీ కింద తులం బంగారం ఇవ్వలేదుని గుర్తు చేశారు.
Read also: జనవరి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..
మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా కాంగ్రెస్ సర్కార్ అమలు చేయలేదని మండిపడ్డారు. బీరాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం …. ఇప్పటి వరకు పెన్షన్లు మొత్తాన్ని పెంచలేదన్నారు. మనం ఊరుకుంటే ప్రభుత్వం కదలదు… ప్రతీ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని పిలుపు నిచ్చారు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలిసింగ్ పోయి… రాష్ట్రంలో కాంగ్రెస్ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తోందన్నారు. రాష్ట్రంలో పోలీసు జులుం నడుస్తుందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన మంచి పనులను ప్రభుత్వం కొనసాగించాలని డిమాండ్ చేశారు. రాబోయేది గులాబీ జెండా శకమే… అందులో సందేహమే లేదన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎగిరేది గులాబీ జెండానే అన్నారు.
Read also: Yadagirigutta: గ్రిల్స్ మధ్యలో ఇరుక్కున్న బాలుడి తల.. తరువాత ఏం జరిగిందంటే..
గురుకులాలను పడడానికి కూడా ప్రభుత్వానికి చేతకావడం లేదన్నారు. ఇప్పటికే 57 మంది పిల్లలను పొట్టనపెట్టుకున్నారు.. ఇంకెంత మందిని పొట్టనపెట్టుకుంటారు ? అని మండిపడ్డారు కవిత. ఉద్యోగాల పేరిట సీఎం రేవంత్ రెడ్డి యువతను తప్పదోవ పట్టిస్తున్నారన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకే ఉద్యోగాలు ఇస్తున్నారన్నారు. మన పొట్టమీదనే కాదు… మన సంస్కృతిపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తుందన్నారు. మళ్లొకసారి నిజామాబాద్ పవర్ ను సీఎం రేవంత్ రెడ్డికి రుచి చూపిద్దామన్నారు.
మైగ్రేన్ తలనొప్పితో బాధ పడుతున్నారా? ఇలా ట్రై చేయండి
తాజావార్తలు
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!