తెలంగాణలో అప్పటి నుండి నైట్ కర్ఫ్యూ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండు సంవత్సరాలుగా అగ్రదేశమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశాలను కరోనా భూతం పట్టిపీడిస్తోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి కరోనా వైరస్ కు టీకాను కనుగొన్నారు. అయితే కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం కోవిడ్ టీకా పంపిణీ మొదలైన.. అప్పటికే కరోనా డెల్టా వేరియంట్ రూపంలో మరోసారి సెకండ్ వేవ్ సృష్టించింది. దీంతో ప్రపంచ దేశాలు సైతం కోవిడ్ టీకా పంపిణీని యుద్ధ ప్రతిపాదిక అమలు చేశారు. దీంతో కరోనా తగ్గుముఖం పట్టింది. భారత్ లోనూ కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో మరోసారి కరోనా రక్కసి ప్రజలపై విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ వంటి దేశాల్లో కోవిడ్ టీకా 75 శాతం జనాభాకు పంపిణీ చేసినా కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి.
అయితే.. ఈ వేరియంట్ ఇప్పటికే పలు దేశాలతో పాటు ఇండియాలోకి కూడా ప్రవేశించింది. అంతేకాకుండా దాని ప్రభావాన్ని చూపుతోంది. దీంతో దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ కంటే శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో థర్డ్ వేవ్ మొదలైంది. కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లో విధించాయి. దీంతో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా రోజుకు 10వేల పై చిలుకు కరోనా కేసులు నమోదవుతుండడంతో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ను విధించింది. అయితే తెలంగాణ సైతం కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. దీనికి తోడు 2సంవత్సరాలకు ఓసారి నిర్వహించే, తెలంగాణకే తలమానికమైన మేడారం సమ్మక్క-సారక్క జాతర ఈ సమయంలోనే ఉండడం ఆందోళన కలిగించే విషయం.
Also Read
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
మేడారం జాతరకు దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మేడారం జాతరలో కరోనా కేసులు పెరిగి అవకాశం కనిపిస్తోంది. ఏపీలో కూడా రోజుకు 5 వేల లోపు కరోనా కేసులు నమోదవుతుండగా.. సంక్రాంతి పండుగ తరువాత 10వేలకు పైగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణాలో రోజూ 4 వేలకు దగ్గరగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 10 దాటితే కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని తెలిపారు. అయితే మేడారం తరువాత కరోనా కేసులు పెరిగితే తెలంగాణ సర్కార్ తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!