తెలంగాణలో అప్పటి నుండి నైట్ కర్ఫ్యూ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండు సంవత్సరాలుగా అగ్రదేశమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశాలను కరోనా భూతం పట్టిపీడిస్తోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి కరోనా వైరస్ కు టీకాను కనుగొన్నారు. అయితే కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం కోవిడ్ టీకా పంపిణీ మొదలైన.. అప్పటికే కరోనా డెల్టా వేరియంట్ రూపంలో మరోసారి సెకండ్ వేవ్ సృష్టించింది. దీంతో ప్రపంచ దేశాలు సైతం కోవిడ్ టీకా పంపిణీని యుద్ధ ప్రతిపాదిక అమలు చేశారు. దీంతో కరోనా తగ్గుముఖం పట్టింది. భారత్ లోనూ కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో మరోసారి కరోనా రక్కసి ప్రజలపై విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ వంటి దేశాల్లో కోవిడ్ టీకా 75 శాతం జనాభాకు పంపిణీ చేసినా కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి.
అయితే.. ఈ వేరియంట్ ఇప్పటికే పలు దేశాలతో పాటు ఇండియాలోకి కూడా ప్రవేశించింది. అంతేకాకుండా దాని ప్రభావాన్ని చూపుతోంది. దీంతో దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ కంటే శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో థర్డ్ వేవ్ మొదలైంది. కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లో విధించాయి. దీంతో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా రోజుకు 10వేల పై చిలుకు కరోనా కేసులు నమోదవుతుండడంతో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ను విధించింది. అయితే తెలంగాణ సైతం కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. దీనికి తోడు 2సంవత్సరాలకు ఓసారి నిర్వహించే, తెలంగాణకే తలమానికమైన మేడారం సమ్మక్క-సారక్క జాతర ఈ సమయంలోనే ఉండడం ఆందోళన కలిగించే విషయం.
Also Read
- Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Telangana Jobs: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
మేడారం జాతరకు దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మేడారం జాతరలో కరోనా కేసులు పెరిగి అవకాశం కనిపిస్తోంది. ఏపీలో కూడా రోజుకు 5 వేల లోపు కరోనా కేసులు నమోదవుతుండగా.. సంక్రాంతి పండుగ తరువాత 10వేలకు పైగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణాలో రోజూ 4 వేలకు దగ్గరగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 10 దాటితే కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని తెలిపారు. అయితే మేడారం తరువాత కరోనా కేసులు పెరిగితే తెలంగాణ సర్కార్ తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
-
Devendra Fadnavis: సీఎం పదవికి ఫడ్నవీస్ రాజీనామా.. సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?