Hyderabad: వరుస హత్యలు.. భయాందోళనలో నగరవాసులు
శాంతి భద్రతల్లో దేశంలోనే అత్యంత సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా పేరు ప్రతిష్టలను మన హైదరాబాద్ నగరం సంపాదించింది. మర్సర్ సర్వేలో సైతం ప్రపంచంలోనే 16వ స్థానం దక్కించుకుంది. తెలంగాణ సాధించిన అనంతరం పోలీసుల సంస్కరణలు, ప్రభుత్వ చర్యలు, పాలకుల ప్రత్యేక దృష్టితో శాంతిభద్రతల్లో ఎంతో మార్పు వచ్చిందని పోలీస్ బాస్లే స్వయంగా చెబుతున్నారు. కానీ, కొన్ని నెలలుగా నగరంలో చోటు చేసుకుంటున్న ఘటనలు నగరంలో మళ్లీ రౌడీల ఉనికిని వెల్లడిస్తున్నాయి. నగరంలోని సౌత్జోన్తోపాటు సెంట్రల్, ఈస్ట్, వెస్ట్జోన్లోని కొన్ని పోలీస్స్టేషన్ల పరిధుల్లో చోటుచేసుకుంటున్న హత్యలు, హత్యాయత్నాలు, దాడుల్లాంటి ఘటనలతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
నగరంలోని లంగర్హౌస్లో దారుణ హత్య జరిగింది. యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పిల్లర్ నెంబర్ 96 వై ఫైబర్ సర్కిల్ ఎదురుగా..కత్తులతో అతికిరాతకంగా హత్య చేశారు. నడిరోడ్డు మీద పడివున్న యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని పరిస్థితులను పరిశీలించారు. పాత కక్షల కారణంగా హత్య జరిగిందా లేక ఇతర కారణాలవల్ల జరిగిందా అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గ్యాంగ్ గా ఏర్పడి పక్కా స్కెచ్ తో హత్య చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Also Read
- Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
- RTC Conductor Jobs: ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..
- Bank Fraud: SBI బ్యాంక్లో పక్కా ప్లాన్ చేశారు.. రూ.2.65 కోట్లను దోచేశారు.. కీపింగ్ స్టాప్, ఫొటో గ్రాఫర్తో పాటు..
- Off The Record : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా?
కాగా .. లాలాగూడ, బంజారాహిల్స్ .. మంగళ, బుధ వారాల్లో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. సికింద్రాబాద్ లాలాగూడలో బోరబండకు చెందిన అఫ్సర్ అనే వ్యక్తిని మంగళవారం రాత్రి దుండగులు పొడిచి చంపారు. ఎక్కడో హత్యచేసి మృతదేహాన్ని లాలాగూడలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. 2017లో జరిగిన హత్యకేసులో అఫ్సర్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడని, ఇటీవలే జైలుకు వెళ్లివచ్చాడని తెలిపారు. పాత కక్షల నేపథ్యంలోనే అతడిని చంపారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక బంజారాహిల్స్ రోడ్ నెం.12 లోని నీలోఫర్ కేఫ్ సమీపంలో మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిల్తో కడుపులో పొడిచి ఓ..వ్యక్తిని హత్య చేశారు. స్నేహితులే ఈపని చేసారా? లేదా పాత కక్షల నేపథ్యంలో హత్య చేసి వుంటారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?