Municipal workers: వేతనాలు ఇవ్వండి.. విధులు బహిష్కరించి మున్సిపల్ కార్మకులు నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Municipal workers: కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లో మున్సిపల్ కార్మకులు నిరసన బాట పట్టారు. విధులు బహిష్కరించి వేతన బకాయిల కోసం ఆందోళన చేపట్టారు. అధికారుల వద్ద నుంచి ఎలాంటి స్పందన లేకపోవంతో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. వేతన బకాయిలు చెల్లించాలని నాలుగు రోజులుగా నల్లబ్యాడ్జీల విధులకు హాజరయ్యారు. వేతనాలు బకాయిలు చెల్లించాలని ఎన్ని సార్లు విన్నవించినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని సార్లు అధికారులకు తమ గోడు తెలిపిన అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాన్ని పోషించుకోవడం ఇబ్బందిగా ఉందని వాపోతున్నారు. పూట గడవాలంటే జీతాలు రాక ఇబ్బంది ఎదుర్కొంటున్నామని తెలిపారు. నాలుగు రోజులుగా నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసనలు తెలిపిన అధికారులు స్పందించలేదని చేసేది ఏమీలేక మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టామని తెలిపారు. వేతన బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
Read also: Top Headlines @9AM: టాప్ న్యూస్
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
తాజాగా.. మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని మణుగూరు పురపాలక సంఘం పారిశుధ్య కార్మికులు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసారు. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ జీతాలు ఇవ్వకపోగా రెగ్యులర్ జీతాలు కూడా మూడు నెలలుగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలో, మూడు మున్సిపాలిటీలో పెంచిన జీతాలు ఇస్తున్నారని. ఇక.. మణుగూరు లోనే పెంచిన జీతాలు లేవని, పాత జీతాలు లేవని కమిషనర్ ని నిలదీశారు. ఇక్కడికి కమిషనర్లు వస్తున్నారు, పోతున్నారు కానీ.. మా బాధలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మా కుటుంబాలని ఎలా పోషించుకోవాలని తమ గోడు వెల్లడించారు. అయితే దీనిపై మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణను వివరణ కోరగా పారిశుధ్య కార్మికులు చేస్తున్న ఈ ఆందోళన సరైన పద్ధతి కాదని.. జనవరి నెల జీతాన్ని మాత్రమే పెండింగ్లో ఉంచుతున్నారని అన్నారు. పెండింగ్లో ఉన్న నెల జీతం చెక్కు సిద్ధంగా ఉంది. మన తప్పేమీ లేదని ఫైనాన్స్ నుంచే రావాలని స్పష్టం చేశారు.
Fire Accident: కూకట్పల్లిలో అగ్నిప్రమాదం.. మూడు బస్సుల్లో చెలరేగిన మంటలు..
తాజావార్తలు
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
-
Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..