Tiger in Mulugu: భద్రాద్రి నుంచి మళ్లీ ములుగులోకి ప్రవేశించిన పెద్ద పులి..
- భద్రాద్రి జిల్లా వైపు వెళ్లిన పెద్ద పులి మళ్లీ ములుగు జిల్లా అడవుల్లోకి..
- పెద్ద పులి గమనాన్ని ఎప్పటి కప్పుడు పరిశీలిస్తున్న అటవీ శాఖ సిబ్బంది..
- పెద్ద పులికి ఆపద రాకుండా చూసుకోవాలని అటవీ గ్రామస్తులకు సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger in Mulugu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించ పెద్దపులి ఇప్పుడు మళ్లీ ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లోకి ప్రవేశించింది. పెద్ద పులి ములుగు తాడ్వాయిలో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నర్సాపూర్ సమీపంలోని గౌరారం వాగు పెద్దపులి అడుగు జాడలు గుర్తించారు. చౌలేడు, కేశవపురం గ్రామల వైపు పెద్దపులి వెళ్ళి వుంటుందని ఎఫ్అర్ఓ సత్తయ్య తెలిపారు. వారం రోజులుగా మంగపేట,తాడ్వాయి, కరకగుడేం,గుండాల అడవుల్లో పెద్దపులి మకాం వేసినట్లు గుర్తించారు. అడవి ఉత్పత్తుల సేకరణ, పశువుల మేత కోసం గ్రామస్తులు అడవులకు వెల్లకుండా ఫారెస్ట్ అధికారులు నియంత్రిస్తున్నారు. పెద్ద పులి గమనాన్ని ఎప్పటి కప్పుడు అటవీ శాఖ సిబ్బంది పరిశీలిస్తున్నారు. పెద్ద పులికి ఆపద రాకుండా చూసుకోవాలని అటవీ గ్రామస్తులకు అధికారులు సూచిస్తున్నారు. ఈ పెద్దపులి అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి, ఇటు ములుగు జిల్లాలోకి తిరుగుతున్న పరిస్థితి ఉందని తెలిపారు.
Read also: Telangana Assembly Live 2024: అసెంబ్లీ సమావేశాలు లైవ్..
Also Read
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
- Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
- Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
గత మూడేళ్ల క్రితం కూడాకరకగూడెం, ఆళ్లపల్లి, రేగళ్ల అటవీ ప్రాంతాల్లో పర్యటించిందని అటవీశాఖ అధికారులు అన్నారు. అప్పట్లో ఒక ఆవుని కూడా పులి చంపి తిందని, ఆ తర్వాత నుంచి పులి ఆనవాళ్లు కనిపించకుండా పోయాయని అన్నారు. మళ్ళీ తిరిగి పులి ఆనవాళ్లు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో గత మూడు రోజుల నుండి పులి కలకలం ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. గుండాలకు సరిహద్దు అడవులైన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో పులి సంచరించినట్టు అధికారులు గుర్తించారు. అక్కడి నుండి గుండాల ఆళ్లపల్లి ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉందని, అడవుల సమీపంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రజల్లో భయాందోళన నెలకొన్నాయి. పులి ఎప్పుడొచ్చి తమను ఏ ప్రమాదానికి గురి చేస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత 2020 సంవత్సరంలో ఆళ్లపల్లి మండలం మార్కోడు అడవుల్లో పులి సంచరించి ఓ రైతును, ఎద్దును చంపివేసిన విషయం తెలిసిందే.
Hyderabad Weather: గజగజా వణికిపోతున్న రాష్ట్రం.. ఆ జిల్లాలకు హెచ్చరిక..
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?