Mulugu: పేరూరు వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. లోతట్టు ప్రాంతాలు జలమయం
- ములగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో విస్తరంగా వర్షాలు..
- భారీ వర్షాలకు గోదావరి నదిలోకి భారీ వరద నీరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mulugu: ములగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో గత రెండు రోజులు గా విస్తరంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువ చత్తీస్గడ్, మహారాష్ట్ర కురిసిన భారీ వర్షాలకు గాను గోదావరి నదిలోకి భారీ వరద నీరు చేరింది. కాగా.. వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతుంది. గోదావరి ఎగువ పోటుతో రహదారులు అన్ని జలమయమయ్యాయి. వెంకటాపురం నుండి భద్రాచలం వెళ్లే మార్గంలో భోదాపురం ,కుక్కతోగు ,బల్లకట్టు ఉదృతంగా ప్రవహించడంతో ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంపుకు గురైన 163 జాతీయ రహదారి వాజేడు మండలం టేకులగూడెం వద్ద గండి మరి మాగు వాగు పొంగడంతో గత 12 రోజులుగా తెలంగాణ – చత్తీస్గడ్ కు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనాలు భారీగా నిలచాయి. అటువైపు ఎవరు వెళ్లకుండా భారీ గేట్లు ఏర్పాటు చేసి పోలీసు బలగాలు భద్రత కల్పిస్తున్నారు.
Read also: Shiva Nursing Home: ఆసుపత్రి వద్ద ఆందోళన.. ఫ్యామిలీ ప్లానింగ్ వికటించి వివాహిత మృతి..
Also Read
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
- Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
- Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
రెండో ప్రమాదక హెచ్చరికకు చేరువలో వాజేడు పేరూరు ముళ్లకట్ట వద్ద ఉదృతంగా గోదావరి ప్రవహిస్తుంది. పేరూరు చెండ్రుపట్ల మధ్య బ్రిడ్జిపై చేరిన వరద నీరు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాజేడు మండలం తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బోగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఎగువ కురిసిన భారీ వర్షాలకు వరద నీ చేరడంతో అటవీశాఖ అధికారులు పర్యాటకుల భద్రత దృష్ట్యా బోగత జలపాతం అనుమతించడం లేదు. వెంకటాపురం మండలం నిండికుండలా పాలెం వాగు జలాశయం నాలుగు గేట్లు ఎత్తి నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్న పాలెం వాగు అధికారులు. దీంతో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయం అయ్యాయి. మండల పరిధిలోని రేగుమాగు వాగు ,గుమ్మడి దొడ్డి వాగు, కొంగల వాగు , చీకుపల్లి వాగు, కంకల వాగు, బల్లకట్టు , కుక్కతోగూ , జిన్నాల వాగు , పెంకవాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు వరదల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్న కుంటలు వాగులకు చేపల వేటకు వెళ్లొద్దని సూచించిన పోలీసు ఉన్నతాధికారులు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకి రావద్దని సూచించుతున్న అధికారులు.
Building Collapses: ముంబైలో కూలిన మూడు అంతస్థుల భవనం.. శిథిలాల కింద పలువురు..!
తాజావార్తలు
-
SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
-
Ma Inti Bangaram: సమంత ఖాతాలో మరో ఘనత.. 100 కోట్ల దిశగా ‘మా ఇంటి బంగారం’
-
Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026.. స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ డిస్కౌంట్లు
-
Rohit Sharma: కాస్త ఆకలి తగ్గింది.. అయినా ప్రపంచకప్లో అతడు తప్పక ఉండాల్సిందే!
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?