Shiva Nursing Home: ఆసుపత్రి వద్ద ఆందోళన.. ఫ్యామిలీ ప్లానింగ్ వికటించి వివాహిత మృతి..
- నాచారం శివ నర్సింగ్ హోమ్ లో దారుణం..
- ఫ్యామిలీ ప్లానింగ్ కోసం వచ్చిన బండి సంధ్య వైద్యం వికటించి మృతి..
- హాస్పిటల్ వద్ద బంధువుల ఆందోళన..
Shiva Nursing Home: వైద్యం వికటించి బండి సంధ్య అనే మహిళ మృతి చెందిన ఘటన నాచారం రాఘవేంద్ర నగర్ లోని శివ నర్సింగ్ హోమ్ లో చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు.
మల్లాపూర్ కి చెందిన బండి సంధ్య కి ఇద్దరు పిల్లలు, భర్త ప్రవైట్ ఉద్యోగి. కాగా సంధ్యకు ఇద్దరు పిల్లలు ఉండటంతో ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో 25 రోజుల క్రితం శివ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ కు వచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలని చెప్పండంతో ఆసుపత్రి డాక్టర్ ఆపరేషన్ చేసి ఇంటికి పంపాడు. అయితే అప్పటి నుంచి సంధ్యకు కడుపులో నొప్పి రావడం, ఆరోగ్యం సరిగా లేకపోవడం జరగడంతో కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. సంధ్యను పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని స్కానింగ్ చేసి ఆశ్చర్యపోయారు. ఇక్కడి రాక ముందు వేరే ఆసుపత్రికి వెళ్లారా అని ప్రశ్నించగా సంధ్య అవును ఫ్యామిలీ ప్లానింగ్ కోసం శివ నర్సింగ్ హోమ్ కు వెళ్లి నట్లు తెలిపింది.
Also Read
- Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
- Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
- Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
- Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
Read also: Champions Trophy 2025: మేం చాలా మంచోళ్లం బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం: షోయబ్ మాలిక్
దీంతో కిమ్స్ ఆసుపత్రి సిబ్బంది ఆమెకు కడుపులో పేగు కి ఇన్ఫెక్షన్ వచ్చింది అని తెలిపారు. సంధ్య బతకడం చాలా కష్టమని తెలిపారు. అయితే అయినా వైద్యం అందిస్తామని తెలిపారు. వైద్యం చేసిన కడుపులో పేగు కి ఇన్ఫెక్షన్ కారణంగా సంధ్య మృతి చెందింది. దీంతో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ సరిగా చేయలేదని కుటుంబసభ్యులు మండిపడ్డారు. ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివ నర్సింగ్ హోమ్ డాక్టర్స్ నిర్లక్ష్యం వలనే సంధ్య మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. డాక్టర్స్ పై తగు చర్యలు తీసుకోవాలి అని బంధువుల డిమాండ్, హాస్పిటల్ వద్ద బంధువుల ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగేంత వరకు మృత దేహాన్ని కదిలించేది లేదని డిమాండ్ చేశారు. ఇద్దరు పిల్లలు ఉన్నారని ఫ్యామిలీ ప్లానింగ్ కు వస్తే పరలోకానికి పంపారని కుటుంబ సభ్యులు రోదించారు.
Building Collapses: ముంబైలో కూలిన మూడు అంతస్థుల భవనం.. శిథిలాల కింద పలువురు..!
తాజావార్తలు
-
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!
-
Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
Ashu Reddy: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది.. బాదితుడి సంచలనం!
-
The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్కి డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!