Shiva Nursing Home: ఆసుపత్రి వద్ద ఆందోళన.. ఫ్యామిలీ ప్లానింగ్ వికటించి వివాహిత మృతి..
- నాచారం శివ నర్సింగ్ హోమ్ లో దారుణం..
- ఫ్యామిలీ ప్లానింగ్ కోసం వచ్చిన బండి సంధ్య వైద్యం వికటించి మృతి..
- హాస్పిటల్ వద్ద బంధువుల ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiva Nursing Home: వైద్యం వికటించి బండి సంధ్య అనే మహిళ మృతి చెందిన ఘటన నాచారం రాఘవేంద్ర నగర్ లోని శివ నర్సింగ్ హోమ్ లో చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు.
మల్లాపూర్ కి చెందిన బండి సంధ్య కి ఇద్దరు పిల్లలు, భర్త ప్రవైట్ ఉద్యోగి. కాగా సంధ్యకు ఇద్దరు పిల్లలు ఉండటంతో ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో 25 రోజుల క్రితం శివ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ కు వచ్చింది. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకోవాలని చెప్పండంతో ఆసుపత్రి డాక్టర్ ఆపరేషన్ చేసి ఇంటికి పంపాడు. అయితే అప్పటి నుంచి సంధ్యకు కడుపులో నొప్పి రావడం, ఆరోగ్యం సరిగా లేకపోవడం జరగడంతో కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. సంధ్యను పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని స్కానింగ్ చేసి ఆశ్చర్యపోయారు. ఇక్కడి రాక ముందు వేరే ఆసుపత్రికి వెళ్లారా అని ప్రశ్నించగా సంధ్య అవును ఫ్యామిలీ ప్లానింగ్ కోసం శివ నర్సింగ్ హోమ్ కు వెళ్లి నట్లు తెలిపింది.
Also Read
- Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
Read also: Champions Trophy 2025: మేం చాలా మంచోళ్లం బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం: షోయబ్ మాలిక్
దీంతో కిమ్స్ ఆసుపత్రి సిబ్బంది ఆమెకు కడుపులో పేగు కి ఇన్ఫెక్షన్ వచ్చింది అని తెలిపారు. సంధ్య బతకడం చాలా కష్టమని తెలిపారు. అయితే అయినా వైద్యం అందిస్తామని తెలిపారు. వైద్యం చేసిన కడుపులో పేగు కి ఇన్ఫెక్షన్ కారణంగా సంధ్య మృతి చెందింది. దీంతో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ సరిగా చేయలేదని కుటుంబసభ్యులు మండిపడ్డారు. ఇద్దరు పిల్లలు అనాధలు అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివ నర్సింగ్ హోమ్ డాక్టర్స్ నిర్లక్ష్యం వలనే సంధ్య మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. డాక్టర్స్ పై తగు చర్యలు తీసుకోవాలి అని బంధువుల డిమాండ్, హాస్పిటల్ వద్ద బంధువుల ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగేంత వరకు మృత దేహాన్ని కదిలించేది లేదని డిమాండ్ చేశారు. ఇద్దరు పిల్లలు ఉన్నారని ఫ్యామిలీ ప్లానింగ్ కు వస్తే పరలోకానికి పంపారని కుటుంబ సభ్యులు రోదించారు.
Building Collapses: ముంబైలో కూలిన మూడు అంతస్థుల భవనం.. శిథిలాల కింద పలువురు..!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!