Minister Seethakka: మహిళా సంఘం సభ్యురాలు మరణిస్తే.. రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది..
- మహిళా సంఘం సభ్యురాలు మరణిస్తే ఆమె పేరున ఉన్న రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది..
- స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Seethakka: మహిళా సంఘం సభ్యురాలు మరణిస్తే ఆమె పేరున ఉన్న రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ములుగు జిల్లా ఏర్పడిన నాటి నుంచి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ అభివృద్ధి పథంలో తీసుకెళ్ళుటకు అన్ని ప్రాణాళికలు రూపొందించామన్నారు. జిల్లాలో నూతన కలెక్టరేట్ భవననిర్మాణాలు,సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, వైద్య కళాశాల ఏర్పాటుకు కృషి చేసామని తెలిపారు. రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాలలోని ఆదివాసి గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు రాష్ట్రంలోనే తొలిసారిగా రెండు కంటైనర్ హాస్పిటల్స్ ఏర్పాటు చేసామన్నారు.
Read also: IMD Weathter: నేడు తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు పడే ఛాన్స్..
Also Read
- Bogatha Waterfalls : ఉగ్రరూపం దాల్చిన 'తెలంగాణ నయాగరా'.. సందర్శన నిలిపివేత!
- Mulugu : ప్రాణాలతో చెలగాటం.. వర్షాకాలంలో వాగు దాటేందుకు ఆదివాసీల అవస్థలు.!
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
- Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
సమ్మక్క- సారలమ్మ మేడారం జాతరకు గతంలో ఎన్నడు లేని విధంగా 110 కోట్లు వెచ్చించి ఒక కోటి 50 లక్షల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా జాతర నిర్వహించామని తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్మిలను చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని పేర్కొన్నారు. పైసా ఖర్చు లేకుండా మహిళలు ఆర్టీసి బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించామన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి పేదలకు మెరుగైన వైద్యసేవాలు అందిస్తున్నామన్నారు. సీజనల్ వ్యాధుల నిర్ములనకు 15 రోజులకు ఒకసారి ఇంటింటికి జ్వరం సర్వేలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమ్మక్క – సారాలమ్మ గిరిజన కేంద్ర విశ్వవిద్యాలయం కోసం 337 ఎకరాలు భూమిని కేటాయించడం జరిగింది. త్వరలో తరగతులు ప్రారంభం కానున్నాయనిత తెలిపారు. ప్రజా పాలన ద్వారా ప్రజల నుండి అభయ హస్తం ఆరు గ్యారెంటిలకు దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు.
Read also: Dr MP Laxman: ఆ ఇద్దరి వల్లే దేశం రెండు ముక్కలు అయ్యింది..
గృహజ్యోతి, మహాలక్షి పథకాలు రాని దరఖాస్తుదారుల డేటా ప్రాజాపాలన మండల సేవా కేంద్రాల ద్వారా సరిచేస్తున్నామని తెలిపారు. గృహజ్యోతి పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. మహిళలు పారిశ్రామికవేత్తలు ఎదగాలని ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి కాంటీన్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు కలిపిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు 2 లక్షల వరకు రుణబీమా,పది లక్షల వరకు ఇందిరా జీవిత బీమా పథకం ప్రవేశ పెట్టాలన్నారు. మహిళా సంఘం సభ్యురాలు మరణిస్తే ఆమె పేరున ఉన్న రుణాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా లెక్కలు తేలాల్సి ఉంది..
తాజావార్తలు
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్పాల్కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!