Kasturba School: ప్రారంభానికి నోచుకోని కస్తూరిబా పాఠశాల.. అగమ్యగోచరంగా పిల్లల భవితవ్యం
- ములుగు జిల్లా మంగపేటలో ప్రారంభానికి నోచుకోని కస్తూరిబా పాఠశాల
- ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kasturba School: విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆ స్కూల్లో మాత్రం తరగతులు ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లాలోని మంగపేట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కస్తూరిబా బాలికల ఆశ్రమ పాఠశాల ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా ఇంకా తరగతులను విద్యా శాఖ అధికారులు ప్రారంభించలేదు. పాఠశాల ప్రారంభించకపోవడంతో అడ్మిషన్లు తీసుకున్న 300 మంది పిల్లల భవితవ్యం అగమ్య గోచరంగా మారింది. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పాఠశాలను ప్రారంభించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
Read Also: Excise Policy Case: కేజ్రీవాల్పై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో కవిత పాత్ర ప్రస్తావన
Also Read
- Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశం చేయనున్న సమ్మక్క- సారలమ్మ
- Sammakka Sarakka Jatara: మేడారం మహాజాతరలో మహా అద్భుత దృశ్యం.. గద్దెపై సమ్మక్క కొలువు.!
- Medaram Jatara 2026: మేడారం కొత్త గద్దెలను చూశారా.? ప్రభుత్వం చేస్తున్న భారీ ఏర్పాట్లు ఇవే.!
- Medaram Jathara 2026: చివరి దశకు మేడారం గుడి పునర్నిర్మాణ పనులు
ములుగు జిల్లా మంగపేట మండలం చుంచుపల్లిలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను మండల కేంద్రంలోని ఎంఈవో కార్యాలయం వెనుక నిర్మిస్తోన్న నూతన భవనంలోకి మార్చారు. ఈ క్రమంలోనే దాదాపు 300 మంది విద్యార్థులు ఇతర పాఠశాలల నుంచి టీసీలు తీసుకుని ఈ పాఠశాలలో చేరారు. కానీ విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా.. నూతన భవనంలో తరగతులు ప్రారంభం కాలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక, వారి గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
గతంలో చుంచుపల్లిలో 60 మందికి మాత్రమే వసతులు ఉండడంతో అక్కడ అంత మందికి మాత్రమే బోధన జరిగేది. ఇప్పుడు కొత్తగా నూతన భవనంలోకి మార్పు చేస్తామని అడ్మిషన్లు తీసుకొని అధికారులు కాలయాపన చేస్తున్నారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. భవన నిర్మాణ పనులు పూర్తి కాలేదని ఆలస్యం చేస్తున్నారో.. వసతులు, టీచర్ల కొరతతో ఆలస్యం చేస్తున్నారో తెలియడం లేదని వారు వాపోతున్నారు. ఏదైతేనేం విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలను ప్రారంభించాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు
తాజావార్తలు
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
-
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!