Site icon NTV Telugu

MP Santosh Kumar : అభయారణ్యం సందర్శన అద్భుతమైన అనుభవం

Santosh Kumar

Santosh Kumar

గుజరాత్‌లోని గిర్‌(GIR) జాతీయ వన్యప్రాణుల అభయారణ్యం సందర్శన అద్భుతమైన అనుభవమని ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ అన్నారు. సైన్స్ అండ్‌ టెక్నాలజీ, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయన పర్యటనలో భాగంగా జైరామ్ రమేష్ అధ్యక్షతన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గుజరాత్‌లోని గిర్‌ నేషనల్ పార్క్‌ను సందర్శించారు. నేషనల్ పార్క్ వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సింహం ఫోటోలను ఎంపీ సంతోష్ కుమార్ తన కెమెరాలో బంధించారు. నేషనల్ పార్క్ సందర్శనలో మంత్రముగ్ధులను చేసే ఎన్నో జ్ఞాపకాలు కలిగి ఉన్నాయి.. వాటి జ్ఞాపకార్థం తీసిన అద్భుతమైన చిత్రాలు ఇవి అంటూ ట్విట్టర్ లో ఎంపీ సంతోష్ కుమార్ పోస్ట్‌ చేశారు.

Exit mobile version