Site icon NTV Telugu

Love marriage: ప్రేమ వివాహంలో కలతలు.. ముగ్గురు పిల్లలను కన్నతల్లి ఏంచేసిందంటే..

Illigal Affair

Illigal Affair

Love marriage: తల్లిదండ్రులు ఏమయ్యారో, ఎందుకు ఒంటరిగా ఉన్నారో, ఎందుకు తామెప్పుడూ చూడని చోట వదిలేశారో తెలియని అమాయక పిల్లలు. తండ్రి ఎక్కడికో వెళ్లిపోవడంతో కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి ఊరు కాని ఊరు తీసుకువచ్చి వారిని వదిలేసి వెళ్లిపోయింది. వాళ్లు ఏంచేయాలో ఎక్కడిపోవాలో అర్థంకానీ అయోమయంలో ఉంది అనుమానాస్పదంటా తిరుగుతుంటే ఓ ట్రాఫిక్ పోలీస్ గుర్తించి వారిని బాలల సంరక్షణ కేంద్రానికి తరలించాడు. ఈఘటన యాదగిరిగుట్టలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Read also: Robbery in Kukatpally: కూకట్‌పల్లిలో దొంగల భీభత్సం.. 16 ఇళ్ళలో వరుస చోరీ

యాదగిరిగుట్ట ట్రాఫిక్‌ సీఐ శివశంకర్‌, ఎస్‌ఐ సుధాకర్‌ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌, భగత్‌సింగ్‌ కాలనీ వాసులుగా గుర్తించి అక్కడి పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. అక్కడ పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. ఈ అమ్మాయిల తల్లిదండ్రులది ప్రేమ వివాహం అని తేలింది. కొన్ని రోజుల క్యాంపురం తరువాత, ముగ్గురు పిల్లలు పుట్టారు, మరియు వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. పిల్లల తండ్రి మూడేళ్ల క్రితం భార్య, పిల్లలను వదిలి వెళ్లిపోయాడు. భర్త వెళ్లిన కొద్దిసేపటికే ఆమెకు ఓ ఆటో డ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. అతనితో సహజీవనం చేస్తోంది. ఇద్దరికీ పాప పుట్టింది. అయితే చిన్నారులను ఇలా వదిలేసిన విషయం స్థానికులకు తెలియదు. ఆ రోజు నుంచి ఆమె, ఆటో డ్రైవర్‌, పాప కనిపించలేదు. అనంతరం చిన్నారులకు సంబంధించిన వారి కోసం స్థానికులను పోలీసులు విచారించారు. పెదనాన్న అక్కడ ఉన్నాడని పిల్లలు తెలుసుకుని అతనికి సమాచారం అందించారు. అయితే అతడు కూడా అందుబాటులో లేడని చెప్పడంతో ముగ్గురు చిన్నారులను జిల్లా శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. రెండు రోజుల తర్వాత పిల్లల తండ్రి వచ్చి వారిని తన తమ్ముడి పిల్లలుగా గుర్తించారు. భార్యతో మనస్పర్థలు రావడంతో తమ్ముడు వారికి దూరంగా ఉంటున్నాడని, దీంతో పిల్లలతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పి వెళ్లిపోయాడు. దీంతో ఈ ముగ్గురు చిన్నారులను ఈనెల 20న చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచారు. అక్కడ.. పిల్లలు చెప్పిన మాటలు విని అందరూ షాక్ అయ్యారు.

Read also: Jiyaguda Case Twist: జియాగూడా కేసులో ట్వీస్ట్‌.. సాయినాధుని చంపింది స్నేహితులే

ఈ నెల 14న తన తల్లి, మరో వ్యక్తి తమను ఆటోలో యాదగిరిగుట్టకు తీసుకొచ్చారని తెలిపారు. ఆ తర్వాత కాళ్లు, చేతులు, కాళ్లు కట్టేసి నోటికి గుడ్డలు కట్టి ముగ్గురినీ వదిలేశారు. ముగ్గురిలో పెద్దవాడైన బాలుడు, వారు వెళ్లిన కొద్దిసేపటికే తన చెల్లి, తమ్ముడికి కట్లు కూడా విడిపించినట్లు ఆ ముగ్గురిలో పెద్దవాడైన బాలుడు తెలిపాడు. అయితే ఈ ముగ్గురు ఆటోడ్రైవర్‌తో సహజీవనం చేయకుండా అడ్డుకోవడంతో తల్లి పిల్లలను యాదగిరిగుట్టలో వదిలేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురు పిల్లలు హైదరాబాద్‌లోని శిశు విహార్‌లో, ఇద్దరూ మధుర నగర్‌లోని శిశు విహార్‌లో ఉన్నారు.
KTR: ఇండియన్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌లో తెలంగాణ రెండో స్థానం

Exit mobile version