Mohammad Azharuddin: ఆ తొక్కిసలాటతో HCAకి సంబంధం లేదు.. పేటీఎందే ఆ బాధ్యత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Azharuddin Gives Clarity On Gymkhana Incident: హైదరాబాద్ జింఖానాలో జరిగిన తొక్కిసలాటతో హెచ్సీఏకు ఎలాంటి సంబంధం లేదని హెచ్సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. అసలు మ్యాచ్ టికెట్స్ అమ్మకాలపై హెచ్సీఏకు సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. టికెట్స్ విక్రయాల బాధ్యతను తాము పూర్తిగా పేటీఎంకే అప్పగించామన్నారు. టికెట్ల విక్రయాలను పేటీఎంకు అప్పగించిన తర్వాత ఇక టికెట్ల విక్రయంతో హెచ్సీఏకు సంబంధం ఏముంటుంది? అని తిరిగి ప్రశ్నించారు. తాము టికెట్లను బ్లాక్ చేయలేదని.. బ్లాక్లో టికెట్లను విక్రయించారని వస్తున్న వార్తల్లోనూ వాస్తవం లేదని స్పష్టం చేశారు. దీనిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఒకవేళ జింఖాన వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై తెలంగాణ పోలీసులు తమపై కేసులు.. తాము పేటీఎం మీద కేసు పెడతామని అజారుద్దీన్ హెచ్చరించారు. ఒకవేళ తొక్కిసలాటలో తన తప్పు ఏమైనా ఉంటే, తనని అరెస్ట్ చేయమని తేల్చి చెప్పారు. తొక్కిసలాట జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులదేనని అన్నారు. అయితే.. కాంప్లిమెంటరీ టికెట్లు మాత్రం భారీ సంఖ్యలోనే ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. ఆఫ్లైన్లో 3 వేల టికెట్లు అమ్ముడయ్యాయని, మిగతా టికెట్లు ఆన్లైన్లో విక్రయించబడ్డాయని క్లారిటీ ఇచ్చారు. ఇక జింఖాన వద్ద తొక్కిసలాట చోటు చేసుకోవడం బాధాకరమని చెప్పిన అజారుద్దీన్.. గాయపడిన వారికి హెచ్సీఏ ఖర్చులతో వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇదే సమయంలో.. హెచ్సీఏలో విభేదాలున్న మాట వాస్తవమేనని కుండబద్దలు కొట్టిన సెక్రటరీ విజయానంద్, మ్యాచ్ సక్సెస్ చేయడం కోసం ప్రెసిడెంట్తో కలిసి పని చేస్తున్నామని అన్నారు.
Also Read
- OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
- Uttam Kumar Reddy: కమిషన్ల కక్కుర్తి వల్లే బ్యారేజీలు కూలాయి.!
- OTR : కాంగ్రెస్ నేతల పొలాల్లో మొలకలు వస్తున్నాయా?
- Telangana Police Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. తెలంగాణ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగ నోటిఫికేషన్స్ విడుదల..
ఇదిలావుండగా.. సెప్టెంబర్ 25వ తేదీన భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం 10 నుంచి 5 గంటల వరకు మ్యాచ్ టికెట్ల అమ్మకాలు జరుగుతాయని హెచ్సీఏ ప్రకటించింది. దీంతో.. హైదరాబాద్ జింఖానా వద్ద క్రీడాభిమానులు భారీగా తరలి వచ్చారు. అయితే.. సరైన ఏర్పాట్లు చేయకపోవడం, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్ల, భారీ జనం తరలిరావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి.
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!