అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభలకు అమెరికా ముస్తాబవుతోంది.. జులై 1-3 తేదీల్లో జరగనున్న ఆటా మహాసభలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు.. ఇప్పటికే వాషింగ్టన్ డీసీలో ఆటా 17వ మహాసభలకు అన్ని ఏర్పాట్లు చేశారు నిర్వహకులు.. ఇక, ఈ మహాసభల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. ఆటా మహాసభలు – యూత్ కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందింగా ఎమ్మెల్సీ కవితను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 2వ తేదీన ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఆ రోజు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు. సాయంత్రం 8 గంటలకు, దాదాపు 10వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఆటా ప్రైమ్ మీట్లో కవిత అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించనున్నారు. ప్రతిష్టాత్మకంగా ఆటా నిర్వహించే ఈ వేడుకలు ఈ సంవత్సరం మరింత పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు పేర్కొన్నారు.. ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.. ఏర్పాట్ల కోసం ఏకంగా 80 కమిటీలుగా ఏర్పడి శ్రమిస్తున్నారు ఆటా ప్రతినిధులు.
ATA Conference: ఆటా మహాసభలకు ఎమ్మెల్సీ కవిత..

Mlc K Kavitha