MLC Jeevan Reddy: తెలంగాణ ప్రభుత్వం దశాబ్ద కాలంగా ప్రజలను దగా చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy Fires On CM KCR And Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం దశాబ్ద కాలంగా ప్రజలను దగా చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పీసీసీ పిలుపు మేరకు.. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ‘దశాబ్ది దగా’ పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీకి వివిధ గ్రామాల నుండి భారీ స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. ఇందిరా భవన్ నుండి తహసిల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి.. చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ ఫొటోకు పది తలలు అంటించి.. ఒక్కో తలకు ఒక్కో ప్రభుత్వ వైఫల్యాన్ని రాసి ఊరేగించారు. ఆ తర్వాత కేసీఆర్ దిష్టబొమ్మను దహనం చేశారు. అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు.
Minister Harish Rao: కేసీఆర్ పాలనలో తెలంగాణకి అవార్డులే అవార్డులు
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారని ఆరోపించారు. గ్రామాల్లో బెల్టు షాపులతో ‘ఎనీ టైం మనీ’ తరహా మద్యం అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మద్యం అమ్మకాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రాథమిక స్థాయి నుండి విశ్వ విద్యాలయం వరకు విద్యను అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. కెసిఆర్ దళితులను, బలహీన వర్గాలను దగా చేస్తున్నారని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని రు.6 లక్షల కోట్ల అప్పుల ఉబిలోకి నెట్టారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో ఒక్క ఎకరానికి అయినా అదనంగా సాగు నీరు అందించారా..? అని నిలదీశారు. ఎస్ఆర్ఎస్పీ కాలువలకు తొమ్మిదేళ్లుగా మరమత్తులు చెపట్టలేదన్నారు. మిషన్ భగీరథ పేరిట రు.40 వేల కోట్లు అప్పుల భారం మోపారని ఆరోపణలు గుప్పించారు. అందరికీ సమాన విద్య అంటూ.. ‘కేజీ టు పీజీ’ హామీ అమలు చేయలేదని ఆగ్రహించారు.
CM KCR: తెలంగాణలో పరిస్థితి తారుమారు అయ్యింది.. మోసపోతే గోసపడతాం
తాజావార్తలు
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Japan Earthquake: జపాన్లో 5.9 తీవ్రతతో భూకంపం.. 20 మందికి గాయాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం
-
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
-
Cargo Ship Sinks in Bay of Bengal: బంగాళాఖాతంలో ఘోర ప్రమాదం.. 24 మంది సిబ్బందితో సరుకు నౌక మునక
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!