MLC Jeevan Reddy: తెలంగాణ ప్రభుత్వం దశాబ్ద కాలంగా ప్రజలను దగా చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy Fires On CM KCR And Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం దశాబ్ద కాలంగా ప్రజలను దగా చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పీసీసీ పిలుపు మేరకు.. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ‘దశాబ్ది దగా’ పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీకి వివిధ గ్రామాల నుండి భారీ స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. ఇందిరా భవన్ నుండి తహసిల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి.. చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ ఫొటోకు పది తలలు అంటించి.. ఒక్కో తలకు ఒక్కో ప్రభుత్వ వైఫల్యాన్ని రాసి ఊరేగించారు. ఆ తర్వాత కేసీఆర్ దిష్టబొమ్మను దహనం చేశారు. అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు.
Minister Harish Rao: కేసీఆర్ పాలనలో తెలంగాణకి అవార్డులే అవార్డులు
Also Read
- Bhatti Vikramarka: కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్.. కాలేశ్వరం డిజైన్పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.!
- Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- TG20 తొలి ఛాంపియన్గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారని ఆరోపించారు. గ్రామాల్లో బెల్టు షాపులతో ‘ఎనీ టైం మనీ’ తరహా మద్యం అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మద్యం అమ్మకాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రాథమిక స్థాయి నుండి విశ్వ విద్యాలయం వరకు విద్యను అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. కెసిఆర్ దళితులను, బలహీన వర్గాలను దగా చేస్తున్నారని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని రు.6 లక్షల కోట్ల అప్పుల ఉబిలోకి నెట్టారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్తో ఒక్క ఎకరానికి అయినా అదనంగా సాగు నీరు అందించారా..? అని నిలదీశారు. ఎస్ఆర్ఎస్పీ కాలువలకు తొమ్మిదేళ్లుగా మరమత్తులు చెపట్టలేదన్నారు. మిషన్ భగీరథ పేరిట రు.40 వేల కోట్లు అప్పుల భారం మోపారని ఆరోపణలు గుప్పించారు. అందరికీ సమాన విద్య అంటూ.. ‘కేజీ టు పీజీ’ హామీ అమలు చేయలేదని ఆగ్రహించారు.
CM KCR: తెలంగాణలో పరిస్థితి తారుమారు అయ్యింది.. మోసపోతే గోసపడతాం
తాజావార్తలు
-
Naga Vamsi: పైరసీకి పక్కా ప్లాన్తో నాగ వంశీ చెక్.. ‘లెనిన్’ విషయంలో ఏం జరిగింది?
-
Tollywood : సింగిల్ థియేటర్స్ మూత పడడానికి స్టార్ హీరోలే కారణమా?
-
Balakrishna – Anil Ravipudi: మరోసారి బాలయ్యతో అనిల్ రావిపూడి.. ఫ్యాన్స్కు మాస్ ట్రీట్!
-
Raaka: ‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?.. మొత్తం బడ్జేట్ తెలిస్తే షేక్ కావాల్సిందే!
-
Ram Mandir CEO Vacancy: రామ మందిరం సీఈవో పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హతలు ఏంటి..? ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయో తెలుసా?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!