MLA’s Poaching Case Update: ఎమ్మెల్యేల ఎర కేసు.. హాజరుకావాలని ఆనలుగురికి సిట్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA’s Poaching Case Update: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇవాళ విచారణకు రావాలని నలుగురికి సిట్ నోటీసులు పంపింది. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉదయం 10.30 కు విచారించనుంది. ఇవాళ ఎమ్మెల్యే ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సహా నలుగురు కీలక నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించారణ జరపనుంది. అయితే.. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని ఇప్పటికే సంతోష్, కేరళకు చెందిన డాక్టర్ జగ్గు స్వామి, కేరళలోని భారత ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి, కరీంనగర్ లాయర్ బూసరపు శ్రీనివాస్లకు సిట్ నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తులో వీరి వాంగ్మూలాలు కీలకమని పోలీసు అధికారులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, న్యాయవాది శ్రీనివాస్లు నేడు సిట్ ఎదుట హాజరుకానున్నారు. వీరిని విచారిస్తే కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రధానంగా సంతోష్ విచారణకు హాజరు కావాల్సి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నలుగురిలో ఎవరు సిట్ ముందు హాజరవుతారో అన్నవిషయంపై ఉత్కంఠ రేపుతుంది.
Read also: Karthika Masam : చివరి కార్తీక సోమవారం.. భక్తులతో ఆలయాలు కిటకిట
Also Read
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- Off The Record : ముహూర్తం ఖరారు కాలేదా? కేబినెట్ విస్తరణపై మళ్ళీ బ్రేక్ పడిందా?
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
కేసు దర్యాప్తు పురోగతిని ఈ నెల 29లోగా హైకోర్టుకు సమర్పించాల్సి ఉన్నందున కీలక ఆధారాలను సేకరించాలని సిట్ భావిస్తోంది. గత నెల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్రెడ్డి, గువ్వల బాలరాజు, రేగాకాంతరావు, బీరం హర్షవర్ధన్రెడ్డిలను ప్రలోభపెట్టి బీజేపీలో చేర్చుకునేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై రామచంద్రభారతి, సింహయాజీ, నందకుమార్లను పోలీసులు అదే నెల 26న అరెస్టు చేశారు. తమ విచారణలో వెలుగు చూసిన వాస్తవాల ఆధారంగా నలుగురికి నోటీసులు జారీ చేసింది. వాటిని పరిష్కరించేందుకు సిట్ ఇప్పటికే ప్రశ్నావళిని సిద్ధం చేసింది. మొయినాబాద్ ఫామ్హౌస్లో చర్చ జరిగిన రోజు రామచంద్ర భారతి ఫోన్లో తుషార్తో మాట్లాడింది. పైలట్ రోహిత్ రెడ్డితోనూ మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో తుషార్కు ఉన్న సంబంధాలపై విచారణ జరగనుంది. రామచంద్ర భారతి ఫోన్ నుంచి ‘సంతోష్ బీజేపీ’ పేరుతో ఓ నంబర్కు మెసేజ్లు వెళ్లాయి.
Read also: Srisailam Temple Rush: ముక్కంటి క్షేత్రంలో భక్తుల సందడి
వాటిలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన సమాచారం ఉంది. కానీ ఇప్పటి వరకు సంతోష్ దానిపై నోరు విప్పలేదు. ఇవాళ ఈ మెసేజ్లపై సంతోష్ను ప్రశ్నించనున్నారని సమాచారం. తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి సింహయాజీకి లాయర్ శ్రీనివాస్ విమాన టికెట్ బుక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే.. సింహయాజికి టికెట్ బుక్ చేసుకోవడం అవసరమా? అతనితో సంబంధాల అంశంపై ప్రశ్నించనున్నారు. తుషార్ను రామచంద్ర భారతికి పరిచయం చేసింది డాక్టర్ జగ్గుస్వామి అని టాక్. తుషార్, జగ్గుస్వామి ఇద్దరూ కేరళకు చెందిన వారు కావడంతో కుట్రలో వారి ప్రమేయంపై దర్యాప్తు చేయనున్నారు. ఇక, రామచంద్ర భారతి సంభాషణలో నంబర్ 1 , నంబర్ 2 అని ప్రస్తావన ఉంది. వారు ఎవరో అనేది స్పష్టం చేయడానికి సిట్ ఆరా తీస్తోంది.
Srisailam Temple Rush: ముక్కంటి క్షేత్రంలో భక్తుల సందడి
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!