మెదక్ జిల్లా తూఫ్రాన్లో నిర్వహిస్తున్న సర్వోదయ సంకల్ప యాత్ర లో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా జర్నలిస్టులకు హెల్త్ కార్డు తో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలకు భూతాల ఉద్యమంలో భూములు పంచితే తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఆరోపించారు.
నిరుపేదల భూములు లాక్కొని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని, వ్యవసాయం చేసుకునేందుకు నిరుపేదలకు భూములు లేకుండా పోతున్నాయని ఆమె మండిపడ్డారు. మద్యం ద్వారా వచ్చిన డబ్బులతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, మద్యం సేవించి యువత పెడదారిన పడి తమ కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ మద్యం అమ్మకాలపై నియంత్రణ పెట్టాలని ఆమె కోరారు.