MLA Rekha Nayak Controversy: ఎమ్మెల్యే రేఖానాయక్ హాట్ కామెంట్స్..ఆడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా సాగుతుంటాయి. ఒకవైపు బీజేపీ-టీఆర్ఎస్ మధ్య వేడి రాజుకుంటున్న వేళ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఓ ఫోన్ కాల్ లో హాట్ కామెంట్స్ చేయడంతో జిల్లా వ్యాప్తంగా ఆడియో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారుతోంది. ఎమ్మెల్యే రేఖానాయక్ లంబాడా భాషలో దుర్భాషలతో ఓ వర్గాన్ని కించపరిచేలా మాట్లాడడంపై దళిత సంఘాలు ఆందోళన బాట పట్టారు. ఇంతకీ ఆమె వ్యాఖ్యలు ఏంటి?
నిర్మల్ జిల్లా కేంద్రంలో డిగ్రీ చదువుతున్నఖానాపూర్ నియోజకవర్గం లోని పెంబి మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన కల్యాణి అనే విద్యార్థిని ఓ లీడర్ ఇంట్లో అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతిచెందగా కళ్యాణి మృతి పట్ల దళిత సంఘాలు గిరిజన సంఘాలు మద్దతుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల రాస్తారోకోలు ధర్నాలు నిర్వహించారు. ఈ విషయమై బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని బీఎస్పీ నిర్మల్ జిల్లా ఇన్ ఛార్జి బన్సీలాల్ రాథోడ్ వారిని పరామర్శించి మాట్లాడారు. డిగ్రీ చదువుతున్న గిరిజన యువతిది ఆత్మహత్య కాదు అది హత్యేనని ఆయన ఆరోపించారు.
Also Read
- Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
- Weather Update : తెలంగాణకు బ్రేక్ ఇచ్చిన రుతుపవనాలు.. మళ్లీ వానల జోరు ఎప్పుడంటే.?
- Amit Shah : తెలంగాణలో పోటీ, పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
Read Also: Taiwan: తైవాన్ లో మరో అమెరికన్ లీడర్ పర్యటన.. చైనాకు భయపడేది లేదంటూ ట్వీట్.
ఆ ఇల్లు ఖానాపూర్ నియోజకవర్గంలోని ఓ ప్రముఖ టిఆర్ఎస్ పార్టీ నాయకునికి సంబంధించిన ఇల్లు అని కళ్యాణి మృతిపై రేఖానాయక్ స్పందించకపోవడం సరికాదని బీఎస్పీ నాయకుడు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే రేఖా నాయక్ సదరు నాయకుడికి కాల్ చేసి బూతులు తిట్టారని తెలుస్తోంది. ఓ వర్గాన్ని కించపరిచేలా ఎమ్మెల్యే మాట్లాడడంతో ఖానాపూర్ నియోజకవర్గంలోని ఇంద్రవెల్లి మండల కేంద్రంలో దళిత సంఘాలు ఆందోళన, ధర్నా చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే రేఖా నాయక్ పై చర్యలు తీసుకోవాలని ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే మాటలను జిల్లా దళిత గిరిజన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
ఎమ్మెల్యే ఫోన్ కాల్ వ్యాఖ్యలపై బిఎస్పీ జిల్లా ఇన్ ఛార్జ్ మాట్లాడుతూ తాను ఒక గిరిజన వర్గానికి చెందిన వ్యక్తిననీ …శాసనసభ సభ్యులు రేఖా నాయక్ మాట్లాడడం సమంజసమేనా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే దళిత గిరిజన వర్గాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!