ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మానవత్వాన్ని చాటుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట ప్రాంతవాసి కార్మిక నాయకుడు, వెంకటరమణ అనారోగ్యంతో పదిరోజుల క్రితం మృతి చెందాడు. కాగా ఆయన బ్రతికుండగానే ఆయన కూతురు ఆత్మహత్య చేసుకోగా, ఆమెకు ఒక చిన్న కూతురు ఉంది. దీంతో ఆ చిన్నారి పరిస్థితి చూసి అంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ చిన్నారికి అన్నివిధాలుగా అండగా ఉంటానని చిన్నారిని చదివించి ప్రయోజకురాలిని చేస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హామీ ఇచ్చారు. అంతేకాదు, ఆ చిన్నారి పేరు మీద ఐదు లక్షల రూపాయలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, స్థానిక కార్పొరేటర్లు నాయకులు ఉన్నారు.