Medipally Sathyam : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్కు తప్పిన పెను ప్రమాదం
- పూడూరు మలుపు వద్ద ఎమ్మెల్యే కాన్వాయ్కు ప్రమాదం
- ఎదురుగా వచ్చిన ప్రైవేట్ కార్లు.. అదుపుతప్పిన వాహనాలు
- మొత్తం ఐదు కార్లు ధ్వంసం.. స్వల్ప గాయాలతో పలువురు
- ట్రాఫిక్ అంతరాయం.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medipally Sathyam : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాన్వాయ్కు పెను ప్రమాదం తప్పింది. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనార్థం కరీంనగర్ నుంచి కాన్వాయ్తో బయలుదేరిన ఎమ్మెల్యే వాహనాలు పూడూరు మలుపు వద్దకు చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై వేగంగా సాగుతున్న కాన్వాయ్కు ఎదురుగా జగిత్యాల వైపు నుంచి హైదరాబాదుకు వెళ్తున్న మూడు ప్రైవేట్ కార్లు వరుసగా వచ్చాయి. ఈ క్రమంలో పూడూరు మలుపు వద్ద కాన్వాయ్లోని ఒక కారు అదుపు కోల్పోయి ముందున్న ప్రైవేట్ కారును ఢీకొట్టింది. ఢీకొట్టబడిన కారుతో పాటు దాని వెనుక వస్తున్న మరో రెండు కార్లు కూడా ఒకదానికొకటి ఢీకొని తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
IAF AFCAT 2026 Recruitment: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్.. కొడితే లైఫ్ సెట్
కాన్వాయ్లో ముందున్న వాహనం ఢీకొట్టడంతో, వెనుక వస్తున్న ఎమ్మెల్యే కాన్వాయ్కు చెందిన మరో రెండు కార్లు బ్రేక్ వేయలేకపోయి ఇప్పటికే ఆగి ఉన్న వాహనాలను వెనుక నుండి ఢీకొట్టాయి. దీంతో మొత్తం ఐదు కార్లు-కాన్వాయ్కు చెందిన మూడు వాహనాలు, ప్రైవేట్ కార్లు రెండు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రయాణిస్తున్న వాహనం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, ఆయన పూర్తిగా సురక్షితంగా బయటపడ్డారు. అయితే కాన్వాయ్లో ఉన్న కొంతమంది సిబ్బందికి, ప్రైవేట్ కారుల్లో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
ప్రమాదం కారణంగా కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న కొడిమ్యాల పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ధ్వంసమైన వాహనాలను రహదారి నుండి తొలగించి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, అతి వేగం, అజాగ్రత్త కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Cyber Attack : WhatsApp గ్రూపులను టార్గెట్ చేస్తోన్న సైబర్ నేరగాళ్లు
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!