MLA Dharma Reddy: ఫలించిన బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి.. ప్రతి రైతుకూ రైతుబంధు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Dharma Reddy: రైతులకు మేలు చేయాలన్న బీఆర్ఎస్ కృషి ఫలించిందని.. గతంలోలాగే ప్రతి రైతుకూ రైతుబంధు ఇస్తున్నట్లు పరకాల బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం ఇవాళ సంగెం మండలం కాపులకనపర్తి గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ కుట్ర రాజకీయం పటాపంచలు అయ్యిందని తెలిపారు. రైతుబంధుకు లైన్ క్లియర్ అయ్యిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి ఫలించిందని.. మంగళవారం నుంచి పంపిణీకి చర్యలు మొదలు అవుతాయని తెలిపారు. రైతులకు మేలు చేయాలన్న బీఆర్ఎస్ కృషి ఫలించిందని, రైతులకు కీడు చేయాలనుకున్న కాంగ్రెస్ కుట్రలు పటాపంచలయ్యాయని, యాసంగి సీజన్కు సంబంధించిన రైతుబంధు పంపిణీకి లైన్క్లియర్ అయిందని అన్నారు. రైతుబంధు పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిందని చల్లా ధర్మారెడ్డి అన్నారు. రైతుబంధు పంపిణీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలుచేసిన ఈసి నిర్ణయం చెంప పెట్టులాంటిదని అన్నారు.
Read also: Yogi Adityanath: పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని వాడు.. ప్రభుత్వం ఏం నడుపుతాడు..!
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
60 ఎండ్ల పాలనలో కూడా ప్రజల కష్టాలను,రైతులను కాంగ్రెస్ పార్టీ ఏనాడూ పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. ఈ నెల మంగళవారం నుంచి రైతుబంధు డబ్బులు రైతులకు అందుతాయని తెలిపారు. అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మద్దతు తెలిపి మూడోసారి కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని అన్నారు. సంగెం పల్లారుగుడ గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఎమ్మెల్యే ఆహ్వానించారు. పదవి మీద వ్యామోహంతో.. నర్సంపేటలో చెల్లని వ్యక్తి, తెలంగాణ ద్రోహి, అహంకారపు మాటలు మాట్లాడుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డిని మూడో తేదీ తర్వాత తగిన బుద్దిచెప్పాలన్నారు. నర్సంపేటకి తిరిగి సాగనంపడానికి పరకాల ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు. పార్టీలో చేరిన వారు వారి నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Purandeswari: రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు విలయ తాండవం చేస్తుంది..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!