Nizamabad: ఆర్మూల్ లో దారుణం.. అక్కాచెల్లెళ్లపై పెట్రోల్ పోసి నిప్పు..!
Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో దారుణం జరిగింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు వారిని హతమార్చి, మృతదేహాలకు నిప్పంటించారు. మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన జరగగా, ఈ ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.
Read also: MP Komatireddy: కోమటిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ల సమావేశం.. పార్టీ చేరికలపై చర్చ
Also Read
- Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
- Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
- Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కు చెందిన అక్కాచెల్లెళ్లు మగ్గిడి రాజవ్వ(72), గంగవ్వ(62) గత కొంతకాలంగా ఒకే ఇంట్లోనే కలిసి ఉంటున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని దుండగులు వారి ఇంట్లోకి ప్రవేశించారు. అక్కాచెల్లెళ్ల తలపై రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. మృతదేహాలపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. కాగా.. ఈ ఉదయం ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని సమీపంలోని స్థానికులు గమనించారు.
ఇంటి కిటికీ వద్దకు వెళ్లి చూడగా రాజవ్వ, గంగవ్వ కాలిపోయిన స్థితిలో పడి ఉన్నారు. షాక్కు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఏసీపీ ప్రభాకర్రావు, సీఐ సురేష్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి హత్యకు కారణాలేంటి? బంగారం కోసమే హత్య చేశారా? లేక పాత కక్షలతో హత్య చేశారా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. తమ ప్రత్యర్థుల గురించి తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కేసు దర్యాప్తు చేసి నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Minister Roja: సినిమాలో హీరో పాలిటిక్స్లో జీరో.. పవన్పై రోజా కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పుడేనా?
-
Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!