Minister Uttam Kumar: త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం..
- అతి త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తాం..
- నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేసిన మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Uttam Kumar: అతి త్వరలో రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టుకు రావడం ఆనందంగా ఉందని, దేశ చరిత్రలోనే 100 ఏళ్ల చరిత్ర గల ప్రాజెక్ట్ నిజాంసాగర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 10 ఏళ్లలో 1.81 లక్షల కోట్ల అప్పు చేసి ఇరిగేషన్ మీద ఖర్చు చేసిందని తెలిపారు. పాలమూరు, సీతారాం ప్రాజెక్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ల నుంచి ఒక ఎకరంకు కూడా నీళ్ళు పారలేదన్నారు. గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్లు కూలిపోయాయని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ సంవత్సరం రూ.22,500 కోట్లను ఇరిగేషన్ మీద ఖర్చు చేస్తున్నామన్నారు.
Read also: Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్, నాన్ బెయిలబుల్ కేసు నమోదు
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Telangana Farmers: ఆ రైతులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. రూ.351 పెంపు..
- Origin of Telangana: ‘తెలంగాణ’ పేరు ఎప్పడిదో తెలుసా? వందల ఏండ్ల కిందటి ఈ సీక్రెట్ హిస్టరీ సూస్తే మైండ్ పోవాల్సిందే!
జాతీయ నీటి సంఘం ఇచ్చిన ఆదేశాలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఉన్నా మూడు బ్యారేజ్లలో నీళ్ళు వినియోగించలేదని అన్నారు. కాళేశ్వరం నీటిని సముద్రంలో వదిలేశామన్నారు. కాళేశ్వరం నీటిని వాడకుండా అత్యధికంగా వరి దిగుబడిని సాధించామన్నారు. కేబినెట్ మంత్రులంతా రైతుల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తున్నామని తెలిపారు. నాగ మడుగు ఎత్తిపోతల పథకంను పూర్తి చేస్తామని తెలిపారు. లెండి ప్రాజెక్ట్ పూర్తి అయ్యేందుకు చర్యలు తీసుకుంట అన్నారు.
ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. 10 నెలల్లో 55 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రవేట్ రంగంలో యువతకు ఉపాధి కలిగేలా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని అన్నారు. అనవసర విమర్శులు చేసే వారిని పట్టించుకోమన్నారు. జర్నలిస్టులకు మా మద్దతు ఉంటదని మంత్రి తెలిపారు.
Ponguleti Srinivasa Reddy: ఇందిరమ్మ ఇంటికి మొదటి విడతగా లక్ష రూపాయలు..
తాజావార్తలు
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
-
Ram Charan : ఇలాంటి అద్భుతమైన కథ దొరికినప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం?
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!