Site icon NTV Telugu

Minister Srinivas Goud : బండి సంజయ్‌.. ఒక లుచ్చా, సైకోలా మాట్లాడుతున్నావ్

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌పై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తీవ్ర స్థాయి ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారని శ్రీనివాస్‌ గౌడ్‌ అగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ తీర్మానం ద్వారా తెలంగాణ ఎందుకు ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. కళ్ళకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారా? 30 వేల మంది కర్నూలు, ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్నారని ఆయన మండిపడ్డారు. పిచ్చోడిలా బీజేపీ నేతలు తిరుగుతున్నారని, చేతగాక వ్యక్తిగత విషయాలను మాట్లాడుతున్నారన్నారు. బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను వాడు, వీడు అని సంబోధిస్తావా. ఒక లుచ్చా, సైకోలా మాట్లాడుతున్నావ్ అంటూ మంత్రి మండిపడ్డారు.

ఎవడ్రా నీకు అధ్యక్ష పదవీ ఇచ్చింది. గతంలో ఉన్న అధ్యక్షులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, దత్తాత్రేయ హుందాగా మాట్లాడారు. నీ అయ్యా, అబ్బా చెప్పాడ్రా పిచ్చి నా కొడక. నీ నాలుక కోస్తాం బిడ్డా. కౌన్సిలర్ స్థాయి నీది. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నావ్. నీ కుటుంబ సభ్యుల జోలికి వచ్చామా? పాదయాత్రలో మధ్యలో బిల్డర్ లకు ఫోన్లు చేసి వచ్చేది మా ప్రభుత్వమే అని డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఆధారాలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతావా? నడ్డా అన్ని అబద్ధాలే మాట్లాడారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 20 వేల కోట్లతో అతిపెద్ద ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యం అవుతుందో చెప్పు. బీజేపీ జూట పార్టీ అంటూ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ దుయ్యబట్టారు.

Exit mobile version