NTV Telugu Site icon

Srinivas Goud: రేవంత్ రెడ్డికి కులం పిచ్చి.. బీజేపీ కి మతం పిచ్చి

Srinivas

Srinivas

రేవంత్ రెడ్డికి కులం పిచ్చి.. బీజేపీ కి మతం పిచ్చి.. అంటూ కాంగ్రెస్‌, బీజేపీ నాయ‌కుల‌పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిప‌డ్డారు. పాలమూరు స్టేడియం గ్రౌండ్ లో 40 లక్షల అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ లో నారాయణపేట అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆగ్ర‌హం వ‌క్తం చేశారు. తెలంగాణ వచ్చాక పూర్వ వైభవం తెస్తున్నామ‌ని తెలిపారు. జిల్లా కేంద్రంగా మార్చామ‌ని గుర్తు చేశారు. తెలంగాణాలో ఏ అభివృద్ధి పని జరుగుతున్నా.. ఇక్కడ నారాయణ పేటలో ఏర్పాటు చేస్తున్నామ‌ని మంత్రి అన్నారు. ఇప్పుడు జిల్లా ఆసుపత్రి.. త్వరలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

ఇంతటి అభివృద్ధి పనులు జరుగుతుంటే.. రెండు జాతీయ పార్టీల నాయకులకు దయ్యం పట్టినట్లు ఉందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి ఒక్కనాడు వాళ్ళ కులం వాళ్లకు ఏమీ చేయని నేత అని నిప్పులు చెరిగారు. ఎవరి ఓట్లతో ప్రజా ప్రతినిధిగా గెలిచినవంటూ ఎద్దేవ చేశారు. బండి సంజయ్ ఏమి మాట్లాడుతాడో ఎవ్వరికీ తెలియదు.. కేవలం సీఎం కేసీఆర్ ను తిట్టుకుంటూ తిరగడం తప్ప చేసిందేమీ లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దేశంలోని మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను గుజరాత్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారని మండిప‌డ్డారు.

Bonalu Festival: ఈ నెల 30 నుంచి.. భాగ్య‌న‌గ‌రంలో బోనాల జాతర షూరు..