సింగరేణి కాలనీ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నడిబొడ్డున దారుణమైన ఘటన అందరినీ కలచివేసింది.. ఆరేళ్ల చిన్నారపై అత్యాచారం, హత్య ఘటన కలకలం సృష్టిస్తోంది.. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.. పోలీసులు, అధికారులు ఎవ్వరూ చెప్పినా వినకుండా ఆందోళన కొనసాగిస్తున్నారు.. వారి ఆందోళనతో హైదరాబాద్ – నాగార్జున సాగర్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.. దీంతో.. ఇతర రూట్లలో ట్రాఫిక్ను మళ్లించారు పోలీసులు.. మరోవైపు.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యపై మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్ అయ్యారు.. దోషులను కఠినంగా శిక్షిస్తామన్న ఆమె.. బాలిక కుటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణం రూ.50వేల ఆర్ధిక సాయం ప్రకటించారు.. మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, సిటీ పోలీస్ కమిషనర్లతో మాట్లాడిన మంత్రి సత్యవతి రాథోడ్.. చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దోషులు ఎంతటివారైన ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఉక్కుపాదంతో అణచివేయాలని స్పష్టం చేశారు.. చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. దోషులను కఠినంగా శిక్షించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి సత్యవతి రాథోడ్.
Also Read
- Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
- CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్లో సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
- Tags
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం