Ponnam Prabhakar: బీజేపీ నేత లక్ష్మణ్ అంటే కొంత గౌరవం ఉండే కానీ..
- బీజేపీ నేత లక్ష్మణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం..
- బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉండాలా వద్దా అని ప్రశ్నించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: బీజేపీ నేత లక్ష్మణ్ అంటే కొంత గౌరవం ఉండే కానీ తాను వచ్చిన వర్గాలకు మద్దతుగా ఉండకపోయినా కించపరిచేలా మాట్లాడటం ఏంటి..? అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీజేపీ కుల గణన కి సానుకూలమా..? వ్యతిరేకమా..? అని మండిపడ్డారు. కేంద్ర బీజేపీ మీద ఒత్తిడి తెచ్చేది ఉందా..? లేకంటే బలహీన వర్గాల ద్రోహిగా ఉంటారా..? తేల్చుకోండి అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంత సేపు రాజకీయంగా మతాన్ని వాడుకోవడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఎన్నికల కొరకు కుల గణన అంటున్నావు లక్ష్మణ్ .. ఇప్పుడు ఏం ఎన్నికలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉండాలా వద్దా చెప్పు అని లక్ష్మణ్ పై మండిపడ్డారు. బలహీన వర్గాల వ్యక్తి ప్రధాని మోడీ అని చెప్పే బీజేపీ.. బీసీ లకు ఏం లాభం చేశారు అని సూటిగా ప్రశ్నించారు. రిజర్వేషన్ పై బీజేపీ ది ద్వంద్వ వైఖరి అన్నారు. బీజేపీ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.
Read also: CM Revanth Reddy: ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం..
Also Read
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- TGSRTC: సూపర్ లగ్జరీ టికెట్ ధర చెల్లించి.. లహరి బస్సులో ప్రయాణించండి..
- HCA Controversy: మరో వివాదంలో HCA.. కార్యదర్శి జీవన్ రెడ్డి ఎన్నికపై తీవ్ర ఆరోపణలు.. BCCIకి ఫిర్యాదు
- Job Scam: విదేశాల్లో ఉద్యోగాల పేరుతో హైదరాబాద్లో భారీ మోసం.. రోడ్డున పడ్డ 90 మంది నిరుద్యోగులు.!
బీజేపీ కి ఉన్న బీసీ అధ్యక్షుడునీ తొలగించారని గుర్తుచేశారు. ఎల్పీ నేత ను కూడా బీసీ కి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల గణన.. సకల జనుల సర్వే లాగా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టామన్నారు. బీఆర్ఎస్ వైఖరి .. కుల గణన పై ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. మూసి యాత్రలో కుల వృత్తి దారుల సమస్యలు విన్నామన్నారు. మూసి ప్రక్షాళన కి చేతనైతే సలహాలు..సూచనలు ఇవ్వాలని కోరారు. కేటీఆర్..హరీష్ అడిగినట్టు… హైదరాబాద్ లో మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా తిరుగుతామన్నారు. ట్టానికి లోబడి ఒప్పించి..మెప్పించి సేకరణ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. పదేళ్లు అధికారంలో ఉండి ఎన్ని హామీలు అమలు చేసింది బీజేపీ అని తెలిపారు. ముందు మీ పదేళ్ల హామీలు..అమలు పై చర్చ పెట్టండి అని సెటైర్ వేశారు.
Read also: Nagarjunasagar: తెలుగు రాష్ట్రాల్లో మరో వివాదం… డ్యాం పై చల్లారని నీటి మంటలు
బండి సంజయ్ వాళ్ళని.. వీళ్ళని అరెస్టు చేసి జైల్లో పెడతా అన్నారని గుర్తుచేశారు. కరీంనగర్ జైల్ లో రూం కట్టించిన అన్నాడు.. మొన్న పొయ్యి చూస్తే జైల్లో రూం లేదు ఏం లేదన్నారు. బండి సంజయ్ .. వ్యక్తిగతంగా నాకు సోదరుడు.. కానీ రాజకీయంగా మాపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. చేతనైతే.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి.. బండి సంజయ్ లు కేంద్రం నుండి అదనపు నిధులు తెప్పించాలని కోరారు. పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే ఆమోద ముద్ర వేయించాలని తెలిపారు. తెలంగాణ కి రావాల్సిన నిధులు మీరు తెండి ..లేదంటే మమ్మల్ని తీసుకెళ్ళండి అడుగుతామన్నారు. మీకు చేతనైతే.. బడ్జెట్ లో నిధులు ఇవ్వండి అని సిఎం తో సహా అందరం వస్తామన్నారు.
Green Tea: గ్రీన్ టీ మంచిదని ఎక్కువగా తాగుతున్నారా? అయితే ..
తాజావార్తలు
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!