Minister Mahender Reddy: నేడే మంత్రిగా మహేందర్రెడ్డి బాధ్యతలు స్వీకరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Mahender Reddy: రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నెల 24న పట్నం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. పట్నం సచివాలయం మొదటి అంతస్తులోని కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళవారం సమాచార శాఖ అధికారులు మంత్రి మహేందర్రెడ్డిని కలిసి సన్మానించారు.
Read also: Telangana Rains: వాతావరణశాఖ కీలక అప్డేట్.. సెప్టెంబర్ 2 తర్వాత భారీ వర్షాలకు ఛాన్స్
Also Read
- Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
- KTR: కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే.. పవన్ కళ్యాణ్ మాకు నేర్పాల్సిన అవసరం లేదు!
- Pawan Kalyan: "రాజకీయాల కోసం కాదు.. ప్రజల ఆకాంక్షల కోసం మద్దతిచ్చా".. తెలంగాణపై మరోసారి స్పందన.!
- KTR: "తెలంగాణ కంటే అభివృద్ధి చెందిన రాష్ట్రం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా".. కాంగ్రెస్, బీజేపీకి సవాల్.!
సీఎం కేసీఆర్ కేబినెట్ లోకి పట్నం మహేందర్ రెడ్డికి అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఆయన ఈ నెల 24న రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పట్నం మహేందర్ రెడ్డితో ప్రమాణం చేయించారు. 1994 నుంచి తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానం నుంచి మహేందర్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. 1994 నుంచి 2009 వరకు టీడీపీ క్యాండిడెట్ గా తాండూర్ నుంచి గెలిచిన ఆయన.. 2014 ఎన్నికల ముందు టీడీపీని వీడి బీఆర్ఎస్ పార్టీకి జాయిన్ అయ్యాడు. అయితే, 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన పట్నం మహేందర్ రెడ్డికి కేసీఆర్ మంత్రి వర్గంలో చోటు దక్కింది. రవాణా శాఖ మంత్రి ఆయన పని చేశారు. 2018 ఎన్నికల్లో మరోసారి తాండూరు నుంచి పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక, కాంగ్రెస్ అభ్యర్థిగా బరలోకి దిగిన పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో పట్నం మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్గికి బీఆర్ఎస్ నాయకత్వం ఎమ్మెల్సీ పదవిని ఇచ్చింది. గత కొంతకాలంగా తాండూరు నియోజకవర్గంలో పైలెట్ రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పైలెట్ రోహిత్ రెడ్డి, మహేందర్ రెడ్డి మధ్య బహిరంగంగానే పలుసార్లు తోపులాట, విమర్శలు చేసుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక, బీఆర్ఎస్ పార్టీ ఇరువురి నేతల మధ్య రాజీకి ప్రయత్నించింది. కానీ, ఎవరూ కూడా బెట్టు వీడలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మరోసారి పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి వర్గంలోకి స్థానం కల్పిస్తామని చెప్పి.. రోహిత్ రెడ్డికి తాండూర్ ఎమ్మెల్యేగా మరో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.
Allu Arjun : ఫ్యాన్స్ కి స్పెషల్ వీడియోతో సర్ప్రైస్ ఇచ్చిన ఐకాన్ స్టార్..
తాజావార్తలు
-
Ntv Exclusive: ‘పెద్ది’తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
-
Stock Market Crash: కుప్పకూలిన షేర్ మార్కెట్.. సెన్సెక్స్ 1100 పాయింట్లు పతనం.. లక్షల కోట్లు గాల్లోనే!
-
LPG dealerships: గ్యాస్ ఏజెన్సీ ఆఫర్.. ఈ తరహా మెసేజీలు వస్తున్నాయా? ప్రభుత్వం ఏం చెబుతుందంటే..?
-
Fake IPS Officer: నకిలీ ఐపీఎస్ ముఠా గుట్టురట్టు.. సూడో పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసి కిడ్నాప్లు, వసూళ్లు!
-
PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!