Minister KTR: మూసీ నదిపై 5 కొత్త వంతెనలు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్
Minister KTR: హైదరాబాద్ నగరవాసులకు హెచ్ఎండీఏ శుభవార్త చెప్పింది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్కు అనుగుణంగా.. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఎంఎయుడిఆర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వం గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా.. ఈ వంతెన నిర్మాణానికి మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. 5 వంతెన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ, ఈసా నదులపై వంతెనల నిర్మాణం త్వరలో సాకారం కానుందని నగరవాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. మూసీ, ఈసా నదులపై 14 వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రెండేళ్లుగా కరోనా ఎదుర్కొంటున్న పరిస్థితుల కారణంగా మూసీ, ఇసా నదులపై వంతెనల నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది.
Read also: Astrology: సెప్టెంబర్ 25, సోమవారం దినఫలాలు
Also Read
కాగా, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మూసీ నదిపై మూడు చోట్ల, ఈసా నదిపై రెండు చోట్ల వంతెనల నిర్మాణ పనులు ప్రారంభించారు. రూ.168 కోట్లతో ఈ 5 వంతెనల నిర్మాణ పనులకు హెచ్ఎండీఏ ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఉప్పల్ బగాయత్ లేఅవుట్ వద్ద రూ.42 కోట్లతో ఒక వంతెన… ప్రతాపసింగారం-గౌరెల్లి వద్ద రూ.35 కోట్లు, మంచిరేవు వద్ద రూ.39 కోట్లతో మూడు వంతెనలు. బుద్వేల్ ఐటీ పార్క్-1 సమీపంలో ఉప్పల్ భగాయత్, ప్రతాపసింగారం ప్రాంతాల్లో మూసీపై 210 మీటర్ల పొడవునా నాలుగు లైన్ల వంతెనను నిర్మించనున్నారు. 15 నెలల్లో వంతెనల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని వంతెనల నిర్మాణాలను ఏడాదిన్నరలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మూసీ, ఈసా నదులపై వంతెనల నిర్మాణం పూర్తయితే.. ప్రయాణం సులువవుతుంది.. ప్రయాణ దూరం, సమయం గణనీయంగా తగ్గుతుంది.
Ganesh Temple : వినాయకుడికి నైవేద్యంగా నాన్ వెజ్ .. ఎక్కడో తెలుసా?
తాజావార్తలు
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
-
Seshachalam Forest : శేషాచలం అడవుల్లో కార్చిచ్చు.. జీవకోన ప్రాంతంలో ఎగిసిపడుతున్న మంటలు.!
-
GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!