Minister KTR: మూసీ నదిపై 5 కొత్త వంతెనలు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: హైదరాబాద్ నగరవాసులకు హెచ్ఎండీఏ శుభవార్త చెప్పింది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్కు అనుగుణంగా.. మంత్రి కేటీఆర్ నేతృత్వంలో ఎంఎయుడిఆర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వం గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా.. ఈ వంతెన నిర్మాణానికి మంత్రి కేటీఆర్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. 5 వంతెన నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ, ఈసా నదులపై వంతెనల నిర్మాణం త్వరలో సాకారం కానుందని నగరవాసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. మూసీ, ఈసా నదులపై 14 వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే రెండేళ్లుగా కరోనా ఎదుర్కొంటున్న పరిస్థితుల కారణంగా మూసీ, ఇసా నదులపై వంతెనల నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది.
Read also: Astrology: సెప్టెంబర్ 25, సోమవారం దినఫలాలు
Also Read
- Telangana Teachers: తెలంగాణ టీచర్లకు శుభవార్త..
- TG TET 2026 Results: టీజీ టెట్-2026 ఫలితాలు విడుదల..
- Bhatti Vikramarka: కాలేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఫైర్.. కాలేశ్వరం డిజైన్పై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు.!
- Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
కాగా, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మూసీ నదిపై మూడు చోట్ల, ఈసా నదిపై రెండు చోట్ల వంతెనల నిర్మాణ పనులు ప్రారంభించారు. రూ.168 కోట్లతో ఈ 5 వంతెనల నిర్మాణ పనులకు హెచ్ఎండీఏ ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఉప్పల్ బగాయత్ లేఅవుట్ వద్ద రూ.42 కోట్లతో ఒక వంతెన… ప్రతాపసింగారం-గౌరెల్లి వద్ద రూ.35 కోట్లు, మంచిరేవు వద్ద రూ.39 కోట్లతో మూడు వంతెనలు. బుద్వేల్ ఐటీ పార్క్-1 సమీపంలో ఉప్పల్ భగాయత్, ప్రతాపసింగారం ప్రాంతాల్లో మూసీపై 210 మీటర్ల పొడవునా నాలుగు లైన్ల వంతెనను నిర్మించనున్నారు. 15 నెలల్లో వంతెనల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని వంతెనల నిర్మాణాలను ఏడాదిన్నరలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మూసీ, ఈసా నదులపై వంతెనల నిర్మాణం పూర్తయితే.. ప్రయాణం సులువవుతుంది.. ప్రయాణ దూరం, సమయం గణనీయంగా తగ్గుతుంది.
Ganesh Temple : వినాయకుడికి నైవేద్యంగా నాన్ వెజ్ .. ఎక్కడో తెలుసా?
తాజావార్తలు
-
Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
-
Telangana Teachers: తెలంగాణ టీచర్లకు శుభవార్త..
-
Jr NTR: రాజకీయాల్లోకి ఎన్టీఆర్..అసలు విషయం ఇదే!
-
Korean Kanakaraju Teaser: పెనుకొండ నుంచి కొరియా వరకు.. ‘కొరియన్ కనకరాజు’ టీజర్ చూశారా!
-
Tamil Nadu: గోవధ నిషేధంపై విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!