Minister KTR: ఇది కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ఆత్మగౌరవానికి మధ్య పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Fires On Rajagopal Reddy In Munugode By Election Campaign: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్.. రాజగోపాల్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి, డబ్బు మదం ఉన్న ఓ కాంట్రాక్టర్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీ అని మండిపడ్డారు. ఇది మునుగోడు ప్రజల మీద బలవంతంగా రుద్దబడిన ఎన్నిక అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో తెరాస భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్.. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తాగు, సాగు నీటి, విద్యుత్ సమస్యల్ని పరిష్కరించిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ, వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు.
కాంట్రాక్టులు పొంది వచ్చే లాభంతో రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చాడని కేటీఆర్ ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి నిర్వహిస్తున్న ఒక చిన్న కంపెనీకి, అంత పెద్ద కాంట్రాక్ట్ ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న పెద్దలు ఎవరు? అని ప్రశ్నించారు. చేనేతకు 5 శాతం జీఎస్టీ వేసి.. చేనేత కార్మికుల మరణ శాసనాన్ని రాసిన ఘనత బీజేపీదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టు పనులకు అడ్డం పడుతోందెవరో అందరికీ తెలుసని అన్నారు. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే.. మునుగోడు నియోజకవర్గాన్ని తానే దత్తత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రతి మూడు నెలలకు ఓసారి సమీక్ష సమావేశాలు నిర్వహించి, నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చండూరు ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా నిర్వహించిన భారీ ర్యాలీకి కేటీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి కోనమనేని సాంబశివరావు వచ్చారు.
Also Read
- Hyderabad Traffic Alert: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఈ దారుల్లో వెళ్తే ట్రాఫిక్లో చిక్కుకోవాల్సిందే! కంప్లీట్ రూట్ మ్యాప్ ఇదే
- Extends Working Hours : తెలంగాణ ప్రజలకు ఊరట.. ఈ కార్యాలయాల్లో పెరిగిన పనివేళలు
- PM Modi Hyderabad Tour: ప్రధాని మోడీ సభకు సర్వం సిద్ధం.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ పోలీసుల రక్షణ వలయం!
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
తాజావార్తలు
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
-
Manity: వేల కోట్ల టార్గెట్’తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?