Minister KTR: ఇది కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ఆత్మగౌరవానికి మధ్య పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Fires On Rajagopal Reddy In Munugode By Election Campaign: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్.. రాజగోపాల్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి, డబ్బు మదం ఉన్న ఓ కాంట్రాక్టర్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీ అని మండిపడ్డారు. ఇది మునుగోడు ప్రజల మీద బలవంతంగా రుద్దబడిన ఎన్నిక అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో తెరాస భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్.. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తాగు, సాగు నీటి, విద్యుత్ సమస్యల్ని పరిష్కరించిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ, వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు.
కాంట్రాక్టులు పొంది వచ్చే లాభంతో రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చాడని కేటీఆర్ ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి నిర్వహిస్తున్న ఒక చిన్న కంపెనీకి, అంత పెద్ద కాంట్రాక్ట్ ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న పెద్దలు ఎవరు? అని ప్రశ్నించారు. చేనేతకు 5 శాతం జీఎస్టీ వేసి.. చేనేత కార్మికుల మరణ శాసనాన్ని రాసిన ఘనత బీజేపీదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టు పనులకు అడ్డం పడుతోందెవరో అందరికీ తెలుసని అన్నారు. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే.. మునుగోడు నియోజకవర్గాన్ని తానే దత్తత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రతి మూడు నెలలకు ఓసారి సమీక్ష సమావేశాలు నిర్వహించి, నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చండూరు ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా నిర్వహించిన భారీ ర్యాలీకి కేటీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి కోనమనేని సాంబశివరావు వచ్చారు.
Also Read
- Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Komatireddy Venkat Reddy : నేను ప్రచారానికి రాకపోయినా గెలిపించాలి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
- Bhatti Vikramarka: తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. మా టార్గెట్ ఇదే
- Secunderabad: పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు.. ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాలు ప్రారంభం
తాజావార్తలు
-
New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
-
Sooraj Pancholi: కోర్టు క్లీన్ చిట్ ఇచ్చినా.. జియా ఖాన్ కేసులో సూరజ్ బాధకు ముగింపు లేదా?
-
YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
-
Raj Thackeray: మోదీని పొగిడి విదేశాల్లో ఎందుకు ఉంటున్నారు? మాధవన్, వివేక్ ఒబెరాయ్పై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
-
Attack On Pappu Yadav: ఎంపీ పప్పు యాదవ్పై కత్తితో దాడి.. హడలెత్తించిన దుండగులు..
ట్రెండింగ్
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?