Minister KTR: ఇది కాంట్రాక్టర్ అహంకారానికి, మునుగోడు ఆత్మగౌరవానికి మధ్య పోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR Fires On Rajagopal Reddy In Munugode By Election Campaign: కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్.. రాజగోపాల్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి, డబ్బు మదం ఉన్న ఓ కాంట్రాక్టర్ అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీ అని మండిపడ్డారు. ఇది మునుగోడు ప్రజల మీద బలవంతంగా రుద్దబడిన ఎన్నిక అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో తెరాస భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్.. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తాగు, సాగు నీటి, విద్యుత్ సమస్యల్ని పరిష్కరించిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ, వ్యక్తి కేసీఆర్ అని తెలిపారు.
కాంట్రాక్టులు పొంది వచ్చే లాభంతో రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక తెచ్చాడని కేటీఆర్ ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి నిర్వహిస్తున్న ఒక చిన్న కంపెనీకి, అంత పెద్ద కాంట్రాక్ట్ ఎలా వచ్చింది? దాని వెనుక ఉన్న పెద్దలు ఎవరు? అని ప్రశ్నించారు. చేనేతకు 5 శాతం జీఎస్టీ వేసి.. చేనేత కార్మికుల మరణ శాసనాన్ని రాసిన ఘనత బీజేపీదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టు పనులకు అడ్డం పడుతోందెవరో అందరికీ తెలుసని అన్నారు. కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తే.. మునుగోడు నియోజకవర్గాన్ని తానే దత్తత తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రతి మూడు నెలలకు ఓసారి సమీక్ష సమావేశాలు నిర్వహించి, నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. కాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చండూరు ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా నిర్వహించిన భారీ ర్యాలీకి కేటీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ కార్యదర్శి కోనమనేని సాంబశివరావు వచ్చారు.
Also Read
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
తాజావార్తలు
-
Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్లైన్
-
Om Chapter 1: ధనుష్ ‘ఓం’ మూవీపై అంచనాలు పెంచేస్తున్న బర్మా కార్తికేయన్ గ్లింప్స్!
-
CM Rekha Gupta: ఢిల్లీ భవన ప్రమాదంపై సీఎం రేఖా గుప్తా కీలక చర్యలు.. MCD డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది అధికారులు సస్పెండ్
-
Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్పోర్టులో అరెస్ట్.!
-
Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!