NTV Telugu Site icon

బీజేపీ నాయకులకు నిజం చెప్పే అలవాటు లేదు…

koppula eshwar

koppula eshwar

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఇంచార్జ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి పనులకు 31.30కోట్ల రూపాయలతో అంబేద్కర్ చౌక్, గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సంధర్బంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ… దేశంలో రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన మొఖమా బీజేపీ నాయకులది. రెండు వేలు ఇవ్వలేని వాళ్ళు రూ.50లక్షలు కావాలని డిమాండ్ చేయడం సిగ్గు చేటు.

జీహెచ్ఎమ్ సి ఎన్నికల్లో బండి సంజయ్ ఏం మాట్లాడిండు. ఒక్కటైన నిజం ఉందా. బీజేపీ నాయకులకు ఒక్కటి నిజం చెప్పే అలవాటు లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ది, సంక్షేమంలో ఎంత ముందు ఉన్నామో ప్రజలకు తెలుసు. టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం ఒక్కటే. పట్టణాలు, గ్రామాలు, కుల వృత్తుల అభివృద్ధిని కేసీఆర్ ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నడు అంటే తూచ తప్పకుండా పాటిస్తాడు. వందలాది సంవత్సరాలుగా వెనుక బడి ఉన్న కులాలకు దళిత బంధు ఒక వరం అని తెలిపారు.