స్కాలర్షిప్ స్కీమ్పై దృష్టి పెట్టండి : కొప్పుల ఈశ్వర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ (TOSS)కి సంబంధించిన దరఖాస్తులను మానవతా దృక్పథంతో పరిశీలించి అర్హులైన వ్యక్తులు పథకం పొందేందుకు న్యాయం చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం ఇక్కడ అధికారులను ఆదేశించారు. ఎస్సీల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు పథకాలపై సమీక్షించేందుకు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కింద విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు అర్హులైన వారికి రూ.20 లక్షలు ఇస్తోందన్నారు.
అన్ని వర్గాల పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉపకార వేతనాల పథకాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టారని తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని, ప్రభుత్వ భవనాల్లో నిర్వహిస్తున్న హాస్టళ్లలో సోలార్ పవర్ ప్లాంట్లతో వాటర్ హీటర్లు, కోల్డ్ స్టోరేజీలు, స్మార్ట్ టెలివిజన్ సెట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 12 స్టడీ సర్కిళ్లతోపాటు అన్ని జిల్లాల్లో స్టడీ సర్కిళ్లను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
Also Read
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్పై 100% టారిఫ్లు? అమెరికా హౌస్లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!