Jagadish Reddy: దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Jagadish Reddy Praises CM KCR: దేశంలో ఎన్నో పార్టీలు వచ్చాయి, పోయాయి.. కానీ టీఆర్ఎస్ మాత్రం ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. చౌటుప్పల్లో నిర్వహించిన టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం, వనభోజన కార్యక్రమంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సభ్యులంతా కలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఆత్మీయ సమ్మేళనం, వనభోజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని స్పష్టం చేశారు. కులాలకు, మతాలకు అతీతంగా టీఆర్ఎస్ పార్టీలోని నేతలందరూ ఒకే కుటుంబంలా కలిసి ఉంటున్నామన్నారు. ఎవరూ ఊహించని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. అభివృద్ధిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నామని చెప్పారు. 60 ఏళ్ళ నుంచి వెంటాడుతున్న ఫ్లోరోసిస్ సమస్యను ఆరేళ్లలోనే పరిష్కరించి.. చరిత్రలో కేసీఆర్ తిరుగులేని ఘనత సాధించారని కొనియాడారు.
లక్షల కోట్లతో ఈ ప్రాంతంలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. సీఎం ఆకాంక్ష మేరకు మనందరం నడుచుకుందామని, ఏ పిలుపునిచ్చినా కంకణ బద్ధులమై పని చేద్దామని పిలుపునిచ్చారు. అప్పు లేకుండా రైతు వ్యవసాయం చేయాలనే ఆలోచనతోనే కేసీఆర్ ‘రైతు బంధు’ పథకాన్ని అందిస్తున్నారన్నారు. అలాగే.. దళితులు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనే ‘దళిత బందు’ తీసుకొచ్చారని, గిరిజనుల కోసం ‘గిరిజన బంధు’ పథకం కూడా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు. దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వం వైపే చూస్తున్నారని, ఇలాంటి నాయకుడే తమకు కావాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ వస్తేనే తెలంగాణలోని పథకాలు తమ రాష్ట్రాల్లో అమలవుతాయని ఆశ పడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read
- Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
- OTR: వరంగల్ కాంగ్రెస్లో అసలేం జరుగుతోంది? కొండా వర్సెస్ కాంగ్రెస్ నేతలు..
- రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
- సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!