Errabelli Dayakar Rao: పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు గల్లీ నుంచి ఢిల్లీకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్లె ప్రగతి సాధించిన ఫలితాలు ఇక్కడి గల్లీల నుంచి ఢిల్లీకి చేరాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఐదో విడుత పల్లె ప్రగతిలో భాగంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన పల్లెప్రగతి కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ..పల్లె ప్రగతి ద్వారా మన గ్రామాలు దేశానికి ఆదర్శంగా తయారయ్యాయని అన్నారు. ఇదంతా సీఎం కేసీఆర్ చొరవ, అధికారుల శ్రమ, ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమయిందని తెలిపారు. ఈ ప్రగతి ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారని, దానికి తగినట్లుగా అవసరమైన నిధులు ఇస్తున్నారని చెప్పారు.
Also Read
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్తో రాజీ ఎలా కుదిరింది?
- CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
గ్రామాల్లో అన్ని సదుపాయాలు సమకూరుతున్నాయని, సర్వాంగ సుందరంగా తయారయ్యాయని చెప్పారు. ఒకప్పుడు నగరాలు, పట్టణాలకు వలసలు ఉండేవని, ఇప్పుడు అవి తగ్గి.. పల్లెలకు వలస మొదలైందన్నారు. గ్రామంలో పచ్చదనం పెంచేందుకు నర్సరీలు, డంపింగ్ యార్డులు, చెత్తను వేరు చేసే పద్ధతి, అంతిమ సంస్కారాలకు వైకుంఠ ధామాల వంటివి పల్లెప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసుకున్నామన్నారు.
గ్రామాల్లో రైతు వేదికలు, కల్లాలు, రైతులకు ఎదురు పెట్టుబడి, రైతు బీమా, పెన్షన్లు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, ఇలా అన్ని సదుపాయాలు ఎప్పుడూ జరగలేదని, కేవలం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమయ్యాయని మంత్రి చెప్పారు. ప్రభుత్వం గ్రామపంచాయతీలకు నయా పైసా బాకీలేకుండా ఇచ్చేసిందని వెల్లడించారు. కేంద్రం నుంచి రూ.1450 కోట్ల నిధులు రావాల్సి ఉందని వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!