Errabelli Dayakar Rao: కాటమయ్యకు బోనమెత్తిన మంత్రి ఎర్రబెల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ కాటమయ్య బోనమెత్తారు. భక్తుల హర్షధ్వానాల మధ్య కాలమయ్య గుడి చుట్టూ తిరిగి దర్శించుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, కొడకండ్ల, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి తదితర మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పెద్ద వంగర మండలం చిట్యాల గ్రామంలో జరుగుతున్న బోనాల ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. మహిళలతో కలిసి కాటమయ్యకు బోన మెత్తారు. అనంతరం ప్రజలతో కలిసి కాటమయ్యను దర్శించుకున్నారు.
పెద్ద వంగర మండలం చిట్యాల సురమాంబ శ్రీ కంఠ మహేశ్వర స్వామి దేవాలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరైన మంత్రి మహిళలతో కలిసి బోనం ఎత్తారు. ప్రజలు హర్షధ్వానాల మధ్య ప్రజలతో కలిసి కాటమయ్యను దర్శించుకున్నారు. గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మోత్యా తండాలో.. దుర్గమ్మ పండుగ ఉత్సవాలలో మంత్రి పాల్గొన్నారు. గుడిని సందర్శించారు. తండా వాసులకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read
- Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
- CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్లో సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్
- Huzurabad Clash : హుజూరాబాద్లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
- Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
లక్ష్మణ్ తండాలో దుర్గమ్మ పండుగ మండలంలోని లక్ష్మణ్ తండాలో జరిగిన దుర్గమ్మ పండుగ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామంలోని దుర్గమ్మ ఆలయాన్ని తండా వాసులతో కలిసి సందర్శించారు. అమ్మ వారికి మొక్కుకున్నారు. గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధిపై చర్చించారు. దేవరుప్పుల కు చెందిన నీలారపు పెద్ద వెంకన్న కు cmrf చెక్కును పంపిణీ చేశారు.
దేవరుప్పుల లో నిన్న మరణించిన కర్ర కొమురయ్య కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. తన సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకుంటున్న యాదగిరి గౌడ్ ని మంత్రి పరామర్శించారు. రామేశ్వరం, పలుగుల తండాలో దుర్గమ్మ పండుగ కొడకండ్ల మండలం రామేశ్వరం, పలుగుల తండాలో దుర్గమ్మ పండుగ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
తండాలో దుర్గమ్మ గుడిని మంత్రి సందర్శించారు. గుడిలో అమ్మ వారికి మొక్కుకున్నారు. సర్పంచ్ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు ఉన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు, సమస్యల మీద తండా వాసులతో చర్చించారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం