Errabelli Dayakar Rao: కాటమయ్యకు బోనమెత్తిన మంత్రి ఎర్రబెల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ కాటమయ్య బోనమెత్తారు. భక్తుల హర్షధ్వానాల మధ్య కాలమయ్య గుడి చుట్టూ తిరిగి దర్శించుకున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, కొడకండ్ల, పెద్ద వంగర, తొర్రూరు, రాయపర్తి తదితర మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పెద్ద వంగర మండలం చిట్యాల గ్రామంలో జరుగుతున్న బోనాల ఉత్సవాలకు మంత్రి హాజరయ్యారు. మహిళలతో కలిసి కాటమయ్యకు బోన మెత్తారు. అనంతరం ప్రజలతో కలిసి కాటమయ్యను దర్శించుకున్నారు.
పెద్ద వంగర మండలం చిట్యాల సురమాంబ శ్రీ కంఠ మహేశ్వర స్వామి దేవాలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరైన మంత్రి మహిళలతో కలిసి బోనం ఎత్తారు. ప్రజలు హర్షధ్వానాల మధ్య ప్రజలతో కలిసి కాటమయ్యను దర్శించుకున్నారు. గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మోత్యా తండాలో.. దుర్గమ్మ పండుగ ఉత్సవాలలో మంత్రి పాల్గొన్నారు. గుడిని సందర్శించారు. తండా వాసులకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
- Off The Record : సొంత ప్రభుత్వమైనా తగ్గేదే లే.. దొంతి మాధవరెడ్డి రూటే సెపరేటు!
లక్ష్మణ్ తండాలో దుర్గమ్మ పండుగ మండలంలోని లక్ష్మణ్ తండాలో జరిగిన దుర్గమ్మ పండుగ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గ్రామంలోని దుర్గమ్మ ఆలయాన్ని తండా వాసులతో కలిసి సందర్శించారు. అమ్మ వారికి మొక్కుకున్నారు. గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ అభివృద్ధిపై చర్చించారు. దేవరుప్పుల కు చెందిన నీలారపు పెద్ద వెంకన్న కు cmrf చెక్కును పంపిణీ చేశారు.
దేవరుప్పుల లో నిన్న మరణించిన కర్ర కొమురయ్య కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. తన సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై కోలుకుంటున్న యాదగిరి గౌడ్ ని మంత్రి పరామర్శించారు. రామేశ్వరం, పలుగుల తండాలో దుర్గమ్మ పండుగ కొడకండ్ల మండలం రామేశ్వరం, పలుగుల తండాలో దుర్గమ్మ పండుగ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
తండాలో దుర్గమ్మ గుడిని మంత్రి సందర్శించారు. గుడిలో అమ్మ వారికి మొక్కుకున్నారు. సర్పంచ్ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు ఉన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు, సమస్యల మీద తండా వాసులతో చర్చించారు. ఆయా కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?