Meenakshi Natarajan : లక్షలాది పేద ప్రజలకు భూదానోద్యమం వల్ల మేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meenakshi Natarajan Sarvodaya Sankalp Padayatra at Medak District.
భూదానోద్యమానికి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా మాజీ ఎంపీ ఏఐసీసీ పంచాయితీ రాజ్ సంఘం చైర్ పర్సన్ మీనాక్షి నటరాజన్ సర్వోదయ సంకల్ప పాదయాత్ర ప్రారంభించారు. భూదాన్ పోచంపల్లి నుండి మహారాష్ట్రలో వర్ధా వరకు 600 కిలోమీటర్లు ఈ పాదయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఈ పాదయాత్ర మెదక్ జిల్లాలోని మాసాయిపేట నుండి చేగుంట వరకు సాగింది. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. పాదయాత్ర ద్వారా ఎంతో మంది ప్రజలను, రైతులను కలుస్తున్నామని, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామన్నారు. భూదానోద్యమం తెలంగాణలో ప్రారంభమయ్యి దేశ వ్యాప్తంగా విస్తరించిందని, లక్షలాది పేద ప్రజలకు భూదానోద్యమం వల్ల మేలు జరిగిందని ఆమె వెల్లడించారు.
Also Read
చాలా మంది వామపక్ష భావజాలం ఉన్న సంస్థలు, నక్సలైట్లు బలవంతంగా భూములను పేదలకు పంచి పెట్టారు. కానీ అహింసా పద్ధతుల్లో లక్షలాది ఎకరాలు పంచిన ఘనత వినోభాభావేది అని ఆమె తెలిపారు. తెలంగాణలో ధరణి ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం మా పాదయాత్ర లో తెలిసిందని, పాదయాత్ర ముగిసిన తర్వాత తిరిగి తెలంగాణ వస్తాను, ధరణి సమస్యలపై తెలంగాణ రైతుల పక్షాన ఉద్యమిస్తామని ఆమె వెల్లడించారు.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!