TS Congress: అభ్యర్థులను ప్రకటించనే లేదు.. మహేశ్వరంలో మేయర్ పారిజాత ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకా గందరగోళంగానే ఉంది. ఒడిశా ఎన్నికలు సమీపిస్తున్నాయి. కానీ.. హస్తం పార్టీ ఇంకా కిందిస్థాయి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తమ సీఎం అభ్యర్థి ఎవరని ఎన్నిసార్లు అడిగినా చెప్పని నేతలు.. ఇప్పుడు చిన్న చిన్న లీకులు వదులుతున్నారు. ఇదంతా ఒక ఎతైతే రంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్తిగా ప్రచారం జరుగుతుండటం పార్టీశ్రేణుల్లో ఆశక్తికరంగా మారింది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించక ముందే ప్రచారం షురూ అయ్యింది. కాంగ్రెస్ మహేశ్వరం తనకే వచ్చిందని మేయర్ పారిజాత ప్రచారం మొదలుపెట్టారు. మహేశ్వరం కాంగ్రెస్ కార్యకర్తలు పారిజాతకు మద్దతు ఇవ్వాలని ఫోన్లు కూడా రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఏఐసీసీ, పీసీసీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకుండానే సొంతంగా తానే అభ్యర్థినని ప్రచార రథం వేసుకొని పారిజాత తిరుగుతున్నారు. పారిజాత తీరు పై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అభ్యర్థులే ప్రకటించకపోయినా ఈ ప్రచార సభలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. పారిజాత తీరుపై సొంత పార్టీ నేతలే గుర్రుమంటున్నారు. ఇది సరైన పద్దతి కాదంటూ సీరియస్ అవుతున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 15న కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేస్తామని, 75 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీఆర్ ఎస్ కు సేవలందిస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
కాగా.. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పారిజాత నర్సింహారెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరడంతో ఆమెకు బడంగ్పేట కార్పొరేషన్ మేయర్ పదవి దక్కింది. అయితే మంత్రి సబితతో మేయర్ కు కొద్దిరోజులుగా విభేదాలు వచ్చినట్లు సమాచారం. కార్పొరేషన్ పరిధిలో జరిగే ప్రతి కార్యక్రమం తన పరిజ్ఞానం మేరకే జరగాలని మంత్రి మేయర్ పై కఠిన నిబంధనలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న చిన్న పనులు కూడా మంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతున్నాయి. సబిత తీరుతో మనస్తాపం చెందిన పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా చేసి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమకంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించక ముందే పారిజాతా ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Dasara Movie: ఎవరి టైమ్ వాళ్లు లాక్ చేసుకున్నారు? ఇక రిలీజ్ అవ్వడమే లేట్
తాజావార్తలు
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్ను చూడలేకపోతున్నారు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
-
BJP: ‘‘ప్రతిధ్వని’’ ఎక్కడ.? ‘‘ధమకా’’ ఇక్కడే.. రాహుల్పై బీజేపీ సెటైర్లు..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!