TS Congress: అభ్యర్థులను ప్రకటించనే లేదు.. మహేశ్వరంలో మేయర్ పారిజాత ప్రచారం
TS Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకా గందరగోళంగానే ఉంది. ఒడిశా ఎన్నికలు సమీపిస్తున్నాయి. కానీ.. హస్తం పార్టీ ఇంకా కిందిస్థాయి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తమ సీఎం అభ్యర్థి ఎవరని ఎన్నిసార్లు అడిగినా చెప్పని నేతలు.. ఇప్పుడు చిన్న చిన్న లీకులు వదులుతున్నారు. ఇదంతా ఒక ఎతైతే రంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్తిగా ప్రచారం జరుగుతుండటం పార్టీశ్రేణుల్లో ఆశక్తికరంగా మారింది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించక ముందే ప్రచారం షురూ అయ్యింది. కాంగ్రెస్ మహేశ్వరం తనకే వచ్చిందని మేయర్ పారిజాత ప్రచారం మొదలుపెట్టారు. మహేశ్వరం కాంగ్రెస్ కార్యకర్తలు పారిజాతకు మద్దతు ఇవ్వాలని ఫోన్లు కూడా రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఏఐసీసీ, పీసీసీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకుండానే సొంతంగా తానే అభ్యర్థినని ప్రచార రథం వేసుకొని పారిజాత తిరుగుతున్నారు. పారిజాత తీరు పై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అభ్యర్థులే ప్రకటించకపోయినా ఈ ప్రచార సభలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. పారిజాత తీరుపై సొంత పార్టీ నేతలే గుర్రుమంటున్నారు. ఇది సరైన పద్దతి కాదంటూ సీరియస్ అవుతున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 15న కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేస్తామని, 75 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీఆర్ ఎస్ కు సేవలందిస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
- CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
కాగా.. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పారిజాత నర్సింహారెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరడంతో ఆమెకు బడంగ్పేట కార్పొరేషన్ మేయర్ పదవి దక్కింది. అయితే మంత్రి సబితతో మేయర్ కు కొద్దిరోజులుగా విభేదాలు వచ్చినట్లు సమాచారం. కార్పొరేషన్ పరిధిలో జరిగే ప్రతి కార్యక్రమం తన పరిజ్ఞానం మేరకే జరగాలని మంత్రి మేయర్ పై కఠిన నిబంధనలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న చిన్న పనులు కూడా మంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతున్నాయి. సబిత తీరుతో మనస్తాపం చెందిన పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా చేసి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమకంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించక ముందే పారిజాతా ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Dasara Movie: ఎవరి టైమ్ వాళ్లు లాక్ చేసుకున్నారు? ఇక రిలీజ్ అవ్వడమే లేట్
తాజావార్తలు
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!