TS Congress: అభ్యర్థులను ప్రకటించనే లేదు.. మహేశ్వరంలో మేయర్ పారిజాత ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకా గందరగోళంగానే ఉంది. ఒడిశా ఎన్నికలు సమీపిస్తున్నాయి. కానీ.. హస్తం పార్టీ ఇంకా కిందిస్థాయి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. తమ సీఎం అభ్యర్థి ఎవరని ఎన్నిసార్లు అడిగినా చెప్పని నేతలు.. ఇప్పుడు చిన్న చిన్న లీకులు వదులుతున్నారు. ఇదంతా ఒక ఎతైతే రంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్తిగా ప్రచారం జరుగుతుండటం పార్టీశ్రేణుల్లో ఆశక్తికరంగా మారింది. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించక ముందే ప్రచారం షురూ అయ్యింది. కాంగ్రెస్ మహేశ్వరం తనకే వచ్చిందని మేయర్ పారిజాత ప్రచారం మొదలుపెట్టారు. మహేశ్వరం కాంగ్రెస్ కార్యకర్తలు పారిజాతకు మద్దతు ఇవ్వాలని ఫోన్లు కూడా రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఏఐసీసీ, పీసీసీ అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకుండానే సొంతంగా తానే అభ్యర్థినని ప్రచార రథం వేసుకొని పారిజాత తిరుగుతున్నారు. పారిజాత తీరు పై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అభ్యర్థులే ప్రకటించకపోయినా ఈ ప్రచార సభలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. పారిజాత తీరుపై సొంత పార్టీ నేతలే గుర్రుమంటున్నారు. ఇది సరైన పద్దతి కాదంటూ సీరియస్ అవుతున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 15న కాంగ్రెస్ తొలి జాబితా విడుదల చేస్తామని, 75 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బీఆర్ ఎస్ కు సేవలందిస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
కాగా.. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పారిజాత నర్సింహారెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరడంతో ఆమెకు బడంగ్పేట కార్పొరేషన్ మేయర్ పదవి దక్కింది. అయితే మంత్రి సబితతో మేయర్ కు కొద్దిరోజులుగా విభేదాలు వచ్చినట్లు సమాచారం. కార్పొరేషన్ పరిధిలో జరిగే ప్రతి కార్యక్రమం తన పరిజ్ఞానం మేరకే జరగాలని మంత్రి మేయర్ పై కఠిన నిబంధనలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్న చిన్న పనులు కూడా మంత్రి చేతుల మీదుగా ప్రారంభమవుతున్నాయి. సబిత తీరుతో మనస్తాపం చెందిన పారిజాత నర్సింహారెడ్డి రాజీనామా చేసి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమకంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించక ముందే పారిజాతా ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Dasara Movie: ఎవరి టైమ్ వాళ్లు లాక్ చేసుకున్నారు? ఇక రిలీజ్ అవ్వడమే లేట్
తాజావార్తలు
-
Virat Kohli: అరుదైన రికార్డు సాధించిన విరాట్ కోహ్లీ.. చరిత్ర పుటల్లో ఒకే ఒక్కడుగా..
-
US-Iran War: ఇరాన్కు అమెరికా 5 షరతులు.. యురేనియం ఇవ్వాలని డిమాండ్..
-
Satish Kilaru: ‘పెద్ది’లో సుకుమార్ ఇన్వాల్వ్మెంట్..? లాస్ట్ డే డైరెక్టర్ బుచ్చిబాబు చాలా ఎమోషనల్ అయ్యారు!
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..