Sri Krishna Travels: శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో భారీ చోరి..
- శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో భారీ చోరి..
- మహిళా బ్యాగ్ లో రూ.15లక్షల విలువగల బంగారు ఆభరణాలను అపహరించిన దొంగలు..
- మండపేట నుండి హైదరాబాద్ వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Krishna Travels: శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో భారీ చోరి కలకలం రేపింది. మహిళా బ్యాగ్ లో రూ. 15లక్షల విలువ గల బంగారు ఆభరణాలను కొందరు దుండగులు అపహరించారు. మండపేట నుండి హైదరాబాద్ వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో ఈ ఘటన జరిగింది. బ్యాగ్ లో బంగారం కనిపించకపోవడంతో బాధిత మహిళ డయల్ 100 కాల్ చేసింది. బస్సు డ్రైవర్ కు వద్దకు వెళ్లి బాధిత మహిళ తెలపడంతో.. రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద బస్సును నిలిపివేశారు. బాధిత మహిళ ఫిర్యాదుతో బస్సును అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసు స్టేషన్ కు తరలించారు. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. కాగా.. బాధిత మహిళ మాట్లాడుతూ.. బస్సు ఎక్కేటప్పడు తన బ్యాగులో రూ. 15లక్షల విలువగల బంగారు ఆభరణాలు తీసుకుని బయలు దేరానని తెలిపింది. తన వద్దే బ్యాగు వుందని, అయితే ఇంతలోనే బ్యాగ్ నుంచి బంగారు ఆభరణాలు మాయం అయ్యాయని కన్నీరుమున్నీరుగా విలపించింది. పోలీసులు తమకు న్యాయం చేయాలని వేడుకుంటుంది.
బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సులో అందరూ ఉన్నా.. బంగారం ఎవరు తీశారు అనేదానిపై ఆరా తీస్తున్నారు. మహిళ వద్ద రూ. 15లక్షల బంగారం ఉందని బస్సులో ఎవరికి తెలిసిందని ఆరా తీస్తున్నారు. బస్సును పోలీస్టేషన్ వద్దకు తరలించి చెక్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. బస్సు మధ్యలో ఎవరైనా దిగారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే.. బస్సును పోలీస్టేషన్ కు తరలించడంతో ఉదయం 6 గంటల నుంచి ప్రయాణికులు పోలీస్టేషన్ లో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు కూడా ఉండటంతో తల్లి దండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి పోలీస్ స్టేషనల్ లోనే వున్నామని, చిన్న పిల్లలను తీసుకుని ఎంత సేపు ఉండాలని మండిపడుతున్నారు. బ్యాగులు సర్చ్ చేశారని, అయినా కూడా ఎవరిని బయటకు అనుమతించడం లేదని వాపోతున్నారు.
Cyber Fraud: ఆ లింక్ క్లిక్ చేయకండి.. రాష్ట్ర ప్రజలకు సైబర్ సెక్యూరిటీ సూచన..
Also Read
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..