Cyber Fraud: ఆ లింక్ క్లిక్ చేయకండి.. రాష్ట్ర ప్రజలకు సైబర్ సెక్యూరిటీ సూచన..
- రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్ చేసింది..
- సమగ్ర సర్వే పేరుతో ఎటువంటి లింకులు వచ్చిన వాటిని క్లిక్ చేయొద్దు..
- సైబర్ క్రైమ్ నెంబర్ 1930కు డయిల్ చేయాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cyber Fraud: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అలర్ట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే బుధవారం నుంచి మొదలైన విషయం తెలిసిందే. అయితే దీనిని ఆధారంగా చేసుకుని కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని సూచించింది. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఎవరైనా సైబర్ నేరగాళ్లు OTP లు అడిగే తెలపకూడదని తెలిపింది. రాష్ట్ర ప్రజలు ఇటువంటి వారి నుంచి జాగ్రత్త ఉండాలని తెలిపింది. సమగ్ర సర్వే పేరుతో ఎటువంటి లింకులు వచ్చిన వాటిని క్లిక్ చేయవద్దని సూచించారు. సమగ్ర విచారణ ఇంటింటికి నియమించిన అధికారులే వస్తారని పేర్కొంది. మొత్తం సర్వే పూర్తి చేసేందుకు ప్రభుత్వం 94,750 మంది ఎన్యూమరేటర్లు, 9,478 మంది సూపర్వైజర్లను నియమించిందని గుర్తు చేశారు. ఎటువంటి అనుమానం వచ్చినా సైబర్ క్రైమ్ నెంబర్ 1930కు డయిల్ చేయాలని కోరారు.
Read also: CM Revanth Reddy: నేడు సీఎం పుట్టినరోజు.. యాదాద్రిని దర్శించుకోనున్న రేవంత్ రెడ్డి.
Also Read
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
ఇటీవల సైబర్ నేరగాళ్ల వలలో ఎక్కువగా చదువుకున్నవారు, ఉన్నత స్థాయిలో ఉన్నవారే పడుతున్నారు. కష్టపడి కొందరు, వడ్డీలకు డబ్బులిచ్చి మరికొందరు..రోజంతా ఆఫీసులో కూర్చొని.. ఇలా అందరూ ఎన్నో విధాలుగా లక్ష్మీ కటాక్షం కోసం పరితపిస్తుంటారు. కానీ ఈ రోజుల్లో పక్కనోళ్ల సొమ్ము ఎలా కొట్టేద్దామా అని చూస్తున్నవారే ఎక్కువ.. ఇళ్ల మీద పడి డబ్బులు, నగలు దోచుకెళ్లడం ఓల్డ స్టైల్ అయిపోయింది. దర్జాగా సిస్టమ్ ముందు కూర్చుని లూటీ చేస్తూ పోలీసులకు సవాళ్లు విసురుతున్నారు సైబర్ నేరగాళ్లు. డబ్బుల కోసం నిరుద్యోగులను, అమాయక ప్రజలను తమ వలలో పడేంత వరకు మాటలు మాట్లాడి నమ్మకాన్ని పెంచుకుంటారు. ఆతరువాత డబ్బులను దోచుకునే పనిలో పడతారు. అంతేకాదు.. తాజాగా సైబర్ కేటుగాళ్లు రాజకీయ, పోలీసుల వాట్సప్ డీపీ ఫోటోలు పెట్టి కూడా ప్రజలను భయపెట్టి డబ్బులను గుంజుకున్న దాఖలాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సమగ్ర సర్వే పేరుతో ఎవరైనా ఫోన్ చేసినా, లింక్ లు పంపినా నమ్మవద్దని తెలిపారు. సైబర్ కేటుగాళ్ల వలలో పడొద్దని ముందగానే రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేశారు.
IT Raids on Grandhi Srinivas: మూడో రోజు గ్రంధి శ్రీనివాస్ నివాసంలో ఐటీ సోదాలు
తాజావార్తలు
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!