Dowry Harassment: నా భార్య ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రిలో శవాన్ని వదిలేసి భర్త పరార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dowry Harassment: సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా తరుణం బేగంని వరకట్నం కోసం భర్త సాబేర్ మాలిక్, అత్త మామలు వేధిస్తుండంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు వరకట్నం కోసం గొడవ మొదలయ్యాయి. దీంతో మనసికంగా కుంగిపోయాన తరుణం బేగం ఇంట్లో రాత్రి ఉరి వేసుకుని చనిపోయిందని చెప్పి సంగారెడ్డి ఆస్పత్రిలో తరుణం బేగం శవాన్ని వదిలేసి భర్త, అత్తమామలు పరార్ అయ్యారు. భర్త, అత్తమామలే 25 వేల రూపాయల కట్నం కోసం చంపేశారని మృతురాలి బంధువుల ఆరోపిస్తున్నారు. మృతురాలికి మూడు సంవత్సరాలు కొడుకు ఉన్నాడు. ఆ బాలుడి పరిస్థితి ఏంటని రోదిస్తున్నారు. తల్లి శవాన్ని చూస్తూ అమ్మకావాలని ఏడుస్తున్న ఆ బాలుడ్ని ఓదార్చ డానికి ఎవరితరం కాలేదు.
సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ లో సాబేర్ మాలిక్ కుటుంబం నివాసం ఉంటుంది. సాబేర్ మాలిక్ తో తరుణం బేగం ఇచ్చి తల్లి దండ్రులు వివాహం జరిపించారు. అయితే వీరిద్దరి కాపురం కొద్దిరోజులు సజావుగా సాగిన కొద్ది రోజులకు వీరిద్దరి మధ్య వరకట్న వేధింపులు మొదలయ్యాయి. సాబేర్ మాలిక్ తో సహా అత్త మామలు తరుణం బేగంకు డబ్బు తేవాలని వేధించడం మొదలయ్యాయి. అయితే ముందు పుట్టింటి నుంచి తెచ్చిన డబ్బులను అత్త మామమలకు ఇచ్చింది. రాను రాను ఇదే వరుస కొనసాగించారు అత్తింటి వారు. ఇలా సాగుతుండగానే తరుణం బేగంకు బిడ్డ పుట్టాడు. అయితే దీని వల్లైన అత్తింటి వారు మారుతారన్న ఆశతో వున్న తరుణం బేగంకు ఇంకా ఎక్కువయ్యాయి. నీకే కాకుండా నీబిడ్డ కూడా ఇక్కడే ఉండాలంటే మీ ఇంటి నుంచి డబ్బులు తేవాల్సిందే అంటూ వేధింపులు మొదలయ్యాయి. డబ్బులు తీసుకురావాల్సిందే అని భర్త, అత్తమామలు డిమాండ్ చేశారు.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
దీంతో సహనం కోల్పోయిన తరుణం బేగం పుట్టింటి వారికి భారం కాలేక ఆత్మహత్య పాల్పడింది. నిన్న రాత్రి భర్త, అత్తమామలు వేధింపులకు తాళలేక ఇంట్లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో భర్త అత్తమామలు తరుణం బేగం మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకుని వచ్చారు. ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యా చేసుకుందని అక్కడినే వదిలేసి భర్త, అత్తమామలు పరార్ అయ్యారు. దీనిపై ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి తరుణం బేగం కుటుంబ సభ్యులకు సమచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న తరుణం బేగం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తరుణం బేగం ఆత్మహత్య చేసుకునేంత పిచ్చిది కాదని, తనని అత్తింటి వారే చంపేశారంటూ ఆరోపించారు. వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. వీరి వరకట్న వేధింపులకు తన కన్న కూతురు చనిపోగా.. మనవడు దిక్కలేకుండా అయిపోయాడని వాపోయారు. వారికి తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు.
Kia Seltos 2023: కొత్తగా రాబోతోన్న కియా సెల్టోస్.. జూలై 4న ఆవిష్కరణ…
తాజావార్తలు
-
King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Tamannaah Bhatia: ‘రాగిణి 3’ షూటింగ్ ప్రారంభం.. సెట్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా
-
OnePlus N6x: వన్ప్లస్ N6x త్వరలో భారత్లోకి.. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో మరో సంచలనం
-
Palli Chattambi OTT: ఓటీటీలోకి టోవినో థామస్ పీరియడ్ యాక్షన్ డ్రామా… స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!