Manda Krishna Madiga: పొంగులేటి ఖమ్మం రాలేదు… తుమ్మల పాలేరు కు పోలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manda Krishna Madiga: పొంగులేటి ఖమ్మం రాలేదు.. తుమ్మల పాలేరు కు పోలేదని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సానుకలుమని ప్రకటిస్తున్న పార్టీలు తమ బాధ్యత నిర్వర్తించే క్రమంలో చేతులెత్తుస్తున్నారని తెలిపారు. దానివల్లనే 29 ఏళ్లుగా పోరాటం జరుగుతూనే ఉందన్నారు. నరేంద్ర మోడీ కూడా వర్గీకరణకు అనుకూలమని స్వయంగా నాతోనే అన్నారని.. దానికి కిషన్ రెడ్డి నే సాక్ష్యమని మందకృష్ణ అన్నారు. అమిత్ షా కూడా అనూకూలం అనే అన్నాడన్నారు. అది నిజమే అయితే వెంటనే బహిరంగంగా ప్రకటించాలి అది కూడా ఎన్నికలలోపే అన్నారు. ఇద్దరు ఒక అంశం ఎంచుకున్న ఏ చట్టం ఆగలేదన్నారు. పార్లమెంట్ లో ఎపుడూ బిల్ పెడతారో చెప్పాలన్నారు. Sc వర్గీకరణ కు అనుకూలమని YS హయాంలోనే హామీ ఇచ్చారని తెలిపారు. మేనిఫెస్టో లో కూడా పెట్టారని తెలిపారు. కమిషన్ వేసింది,అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది కాంగ్రెస్ అన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉండి కూడా పోరాటం చేయట్లేదని తెలిపారు. సోనియా గాంధీ కూడా పార్టీ అధ్యక్షురాలు హోదాలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఖర్గే కూడా చేవెళ్లలో సభలో డిక్లరేషన్ లో పొందుపరిచారని తెలిపారు. వర్గీకరణ హామీ అనేది పేపర్ల పై ఉంటుంది కానీ,దానిని వాస్తవరూపం దాల్చలేదన్నారు.
కర్ణాటకకు చెందిన ఖర్గే మాల సామాజిక వర్గానికి చెందిన నాయకుడై కూడా హామీ ఇచ్చారు కదా? అని ప్రశ్నించారు. వర్గీకరణపై కాంగ్రెస్ స్టాండ్ ఏంటో చెప్పాలన్నారు. మోడీ కు బహిరంగ లేఖ రాయాలని తెలిపారు. తెలంగాణలో బలమైన శక్తి మాదిగ సమాజమన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలోనే మీ స్టాండ్ ప్రకటించాలని తెలిపారు. BRS వర్గీకరణకు అనుకూలమని బిల్ పాస్ చేసి చేతులు దులుపుకుందని తెలిపారు. KCR చొరవ తీసుకోవడం మర్చిపోయారని మండిపడ్డారు. అఖిల పక్షంను ఢిల్లీకి తీసుకెళ్తా అని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని గుర్తుచేశారు. 2017 నవంబర్ 6న రెండు రోజుల్లో మోడీని కలుస్తా అన్నారని తెలిపారు. కానీ కూతురు కవిత మాత్రం జైల్ కు పోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్న కూతురు మీద ఉన్న ప్రేమ ఓ జాతి మీద లేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపో మాపో జైల్ కు కవిత అన్న వార్తలు వచ్చాయని కీలక వ్యాఖ్యలు చేశారు. మరి కవిత ఎందుకు పోలేదు? అని ప్రశ్నించారు. మోడీ, అమిత్ షా మీరు తలచుకుంటే ఏ చట్టమైనా ఆగిపోతున్నాయని తెలిపారు. చట్ట రూపం పొందుతున్నాయని అన్నారు. Sc రిజర్వేషన్ స్థానాలు 19 ఉన్నాయని, 74,75 శాతం మా మాదిగ జనాభా ఉన్నారని.. దాని ప్రకారం టికెట్లు ఇవ్వాలి కదా? అని ప్రశ్నించారు. ఖమ్మం, మధిర, సత్తుపల్లిలో 40 వేలకు మించి మాధిగలున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మధిర, సత్తుపల్లి లో మాల సోదరులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆ రెండు ప్రాంతాల్లో ఏ సామాజిక వర్గం ఎక్కువ ఉందని తెలిపారు.
Also Read
- Off The Record : మంత్రుల వైఖరి తో నారాజ్ గా ఉమ్మడి మెదక్ కాంగ్రెస్ కేడర్
- Ghost SIM Scam: 'ఘోస్ట్ సిమ్’ గ్యాంగ్ గుట్టురట్టు.. 13 రాష్ట్రాల్లో ఆపరేషన్ ఆక్టోపస్.!
- Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
- TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని నమ్మిన మాధిగలున్నారు అందులో ఒకాయన కొండ్రు సుధాకర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగం వదిలి వచ్చాడు కదా…. అడ్డుకునేది రేణుక చౌదరి,మల్లు భట్టి విక్రమార్క నే అన్నారు. పొంగులేటి ఖమ్మం రాలేదు.. తుమ్మల పాలేరు కు పోలేదని మండిపడ్డారు. ఎవరి సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట వాళ్ళు పోటీలోకి దిగారన్నారు. మరి మాకు ఆ న్యాయం వద్దా? అని ప్రశ్నించారు. 19 స్థానాల్లో మాకు రావాల్సిన స్థానాల్లో కూడా రేవంత్ రెడ్డి మాల లకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. మాదిగలకు ఏ పార్టీలో కూడా గాడ్ ఫాథర్ లేదు కనుకనే.. టికెట్లు రావడం లేదన్నారు. వాళ్లకు రాష్ట్రంలో భట్టి ఉన్నాడు, కేంద్రం లో ఖర్గే ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. 50,60 వేల మంది చొప్పదండిలో ఉంటే కేవలం 6 వేల మంది ఉన్న మాల సోదరుడికి ఇచ్చారని తెలిపారు. బెల్లం పల్లి లో వివేక్ వాళ్ళ అన్న వినోద్ కు ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లాల ఓదెలు కు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. వర్ధన్న పేటలో నాగరాజు అనే పోలీసు అధికారికి ఇచ్చే ప్రయత్నం జరుగుతుందని, చెన్నూర్ కూడా అదే పరిస్థితి ఉందని తెలిపారు.
Vivo Y200: మార్కెట్లోకి వివో నుంచి మరో కొత్త ఫోన్.. తక్కువ ధరలో స్టన్నింగ్ ఫీచర్స్..
తాజావార్తలు
-
Brahma Muhurta Dreams: బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కలలు వస్తే మంచిదో తెలుసా..?
-
PM Modi: విదేశాల నుంచి రాగానే ప్రధాని మోడీ అత్యవసర భేటీ.. అసలు కథ ఇదేనా?
-
US Navy Deployment Cuba: క్యూబాపై ట్రంప్ దృష్టి.. కరేబియన్కు చేరుకున్న అమెరికా యుద్ధనౌక
-
Hardik Pandya: “సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం”.. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!
-
Astrology: మే 21 గురువారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజ చేస్తే మేలు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!